E-Paper
Advertisement

Odisha Train Tragedy : ఘోర కలి .. ఆ 20 నిమిషాల్లోనే.. ప్రమాదం జరిగింది ఇలా..?

Odisha Train Tragedy : ఘోర కలి .. ఆ 20 నిమిషాల్లోనే..   ప్రమాదం జరిగింది ఇలా..?
Advertisement

Odisha Train Tragedy(Telugu breaking news today) : ఒడిశాలోని బాలేశ్వర్‌ లో 3రైళ్లు ఢీ కొనడంతో పెను ప్రమాదం సంభవించింది. నిమిషాల వ్యవధిలోనే పెను విషాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. చాలా మంది ప్రయాణికులు నిద్రలోనే మృత్యుఒడికి చేరుకున్నారు. మరికొంది తీవ్రగాయాలతో ఆర్తనాదాలు చేశారు.

అధికారులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 6.50 గంటల నుంచి 7.10 మధ్యలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాకు వెళుతుండగా బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద తొలుత పట్టాలు తప్పింది. ఈ రైలులోని కొన్ని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాయి.

Advertisement

ఆ బోగీలను షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దీంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. ఆ తర్వాత బోల్తాపడ్డ కోరమండల్‌ బోగీలను గూడ్సు రైలు దూసుకొచ్చి ఢీకొట్టింది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత పెరిగిందని స్థానికులు , అధికారులు చెప్పారు. అలాగే ప్రమాదం సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు రైళ్లు అతి వేగంతో ఉన్నాయని అందుకే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు . క్షతగాత్రులకు రక్తదానం చేసేందుకు చాలామంది ముందుకొచ్చారు. బాలాసోర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రక్తం ఇచ్చేందుకు ప్రజలు బారులు తీరారని తెలుస్తోంది.

Related News

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

Big Stories

Advertisement
×