BigTV English

Odisha Train Tragedy : ఘోర కలి .. ఆ 20 నిమిషాల్లోనే.. ప్రమాదం జరిగింది ఇలా..?

Odisha Train Tragedy : ఘోర కలి .. ఆ 20 నిమిషాల్లోనే..   ప్రమాదం జరిగింది ఇలా..?

Odisha Train Tragedy(Telugu breaking news today) : ఒడిశాలోని బాలేశ్వర్‌ లో 3రైళ్లు ఢీ కొనడంతో పెను ప్రమాదం సంభవించింది. నిమిషాల వ్యవధిలోనే పెను విషాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. చాలా మంది ప్రయాణికులు నిద్రలోనే మృత్యుఒడికి చేరుకున్నారు. మరికొంది తీవ్రగాయాలతో ఆర్తనాదాలు చేశారు.


అధికారులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 6.50 గంటల నుంచి 7.10 మధ్యలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాకు వెళుతుండగా బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద తొలుత పట్టాలు తప్పింది. ఈ రైలులోని కొన్ని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాయి.

ఆ బోగీలను షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దీంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. ఆ తర్వాత బోల్తాపడ్డ కోరమండల్‌ బోగీలను గూడ్సు రైలు దూసుకొచ్చి ఢీకొట్టింది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత పెరిగిందని స్థానికులు , అధికారులు చెప్పారు. అలాగే ప్రమాదం సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు రైళ్లు అతి వేగంతో ఉన్నాయని అందుకే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు . క్షతగాత్రులకు రక్తదానం చేసేందుకు చాలామంది ముందుకొచ్చారు. బాలాసోర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రక్తం ఇచ్చేందుకు ప్రజలు బారులు తీరారని తెలుస్తోంది.

Related News

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

Big Stories

×