E-Paper
Advertisement

Parliament latest news : మణిపూర్ పై రగడ.. పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం..

Parliament latest news : మణిపూర్ పై రగడ.. పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం..
Parliament session updates

Parliament session updates(Latest political news in India) : మణిపూర్ అంశం పార్లమెంట్ ను కుదుపేస్తోంది. ఈ వర్షాకాల సెషన్ లో పార్లమెంట్ ఉభయ సభల్లో కార్యకలాపాలు సజావుగా సాగడం లేదు. ప్రతిపక్షాల ఆందోళనతో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సోమవారం కూడా పార్లమెంట్ లో అదే పరిస్థితి ఎదురైంది. మణిపూర్ అంశాన్ని రూల్‌ 267 కింద చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్ సభ వాయిదా పడింది. అలాగే రాజ్యసభ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.

సోమవారం పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమవడానికి ముందు ప్రధాని మోదీ
కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. తాజాగా పరిణామాలపై చర్చించారు. మరోవైపు ప్రతిపక్షాల కూటమి ఇండియా సభ్యులు కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండురోజులపాటు మణిపూర్‌లో పర్యటించిన ఎంపీలు ఈ భేటీకి హాజరయ్యారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

రాజ్యసభలో మణిపూర్ అంశాన్ని చర్చించాలని తాము కోరుకుంటున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ తెలిపారు. సభ్యులకు ఇచ్చిన స్వేచ్ఛను విపక్ష ఎంపీలు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా విపక్షాలు 9 రోజులపాటు సభా సమయాన్ని వృథా చేశాయని వెల్లడించారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×