E-Paper
Advertisement

PM Kisan 22nd Installment: పీఎం కిసాన్ రూ.2 వేలు పడేది అప్పుడే.. మీ పేరు ఇలా చెక్ చేసుకోండి

PM Kisan 22nd Installment: పీఎం కిసాన్ రూ.2 వేలు పడేది అప్పుడే.. మీ పేరు ఇలా చెక్ చేసుకోండి

PM Kisan 22nd Installment: కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 22వ విడత విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో రూ.2 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఏటా రూ.6000 కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుంది. దీనిని నాలుగు నెలకొకసారి రూ.2 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది.

22వ విడత విడుదల ఎప్పుడు?

వ్యవసాయ అవసరాలకు, విత్తనాలు, ఎరువులు, మందులు, నీటిపారుదల, కూలీల ఖర్చులకు పీఎం కిసాన్ డబ్బులు ఉపయోగపడనున్నాయి. ఇప్పటివరకు, ఈ పథకం కింద కేంద్రం 21 వాయిదాలను విడుదల చేసింది. 21వ విడత నవంబర్ 2025లో రైతుల ఖాతాలకు జమ చేసింది. తాజాగా 22వ విడత డబ్బులు ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి ప్రారంభంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ప్రభుత్వం దీనిపై ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. గతంలో వాయిదాలు ఫిబ్రవరి చివరిలో విడుదలయ్యాయి. కాబట్టి ఈసారి కూడా నిధులు దాదాపు అదే సమయంలో వస్తాయని రైతులు భావిస్తున్నారు.

ఎవరికి డబ్బులు అందవు?

ఈ-కేవైసీ పూర్తి చేయని రైతులు పీఎం కిసాన్ డబ్బులు పొందలేరు. ఫార్మర్ ఐడీ లేకపోవడం, బ్యాంక్ ఖాతాకు ఆధార్‌ను లింక్ చేయకపోవడం, తప్పు బ్యాంక్ ఖాతా సమాచారం లేదా భూమి రికార్డులను అప్డేట్ చేయకపోవడం.. ఇలా ఏమైనా తప్పిదాలు ఉంటే.. పీఎం కిసాన్ డబ్బులు జమ కావు.

లబ్దిదారుడి లిస్ట్ మీ పేరు ఉందా?

1. పీఎం కిసాన్ లబ్దిదారుల లిస్ట్ లో మీ పేరును సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ని సందర్శించండి.

2. నో యువర్ స్టేటస్ లేదా బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేయండి.

3. మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

4. క్యాప్చా ఎటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయండి.

5. దీని తర్వాత, మీ మునుపటి వాయిదాలు, తదుపరి విడత స్థితి, ఈ-కేవీసీ సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది.

Also Read : పీఎం కిసాన్ డబ్బులపై అప్డేట్.. జాబితాలో మీ పేరు ఇలా చెక్ చేసుకోండి

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×