E-Paper
Advertisement

PM Kisan Beneficiary List: పీఎం కిసాన్ డబ్బులపై అప్డేట్.. జాబితాలో మీ పేరు ఇలా చెక్ చేసుకోండి

PM Kisan Beneficiary List: పీఎం కిసాన్ డబ్బులపై అప్డేట్.. జాబితాలో మీ పేరు ఇలా చెక్ చేసుకోండి

PM Kisan Beneficiary List: కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏటా రూ.6000 పెట్టుబడి సాయం అందిస్తుంది. మూడు విడతలుగా రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు డిపాజిట్ చేస్తుంది. పీఎం కిసాన్ 22వ విడతపై కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 2026 రైతుల జాబితాను అధికారిక పోర్టల్‌లో అప్‌డేట్ చేసింది.

పీఎం కిసాన్ అర్హుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేస్తుంది. పాత లబ్ధిదారులు లేదా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు 2026 కొత్త లిస్ట్‌లో మీ పేరు చెక్ చేసుకోవచ్చు. బెనిఫిషియరీ జాబితాలో పేరు ఉంటేనే పీఎం కిసాన్ డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయి.

పీఎం కిసాన్ లబ్దిదారు లిస్ట్ లో పేరు చెక్ చేయడం ఎలా?

  • పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/ ను ఓపెన్ చేయండి.
  • హోంపేజీలో Beneficiary List ఆప్షన్ పై క్లిక్ చేయండి
  • మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం పేరును నమోదు చేయండి.
  • అన్ని వివరాలు నమోదు చేసి ‘Get Report’ బటన్ క్లిక్ చేయండి.
  • స్క్రీన్ పై కనిపిస్తున్న జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు లేకపోతే

  • ముందుగా పీఎం కిసాన్ పథకానికి ఇచ్చిన బ్యాంక్ ఖాతాను ఆధార్ తో లింక్ చేసుకోవాలి.
  • మీ పేరుపై భూమి రికార్డులు స్పష్టంగా ఉండాలి.
  • బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలి. అలాగే ఎన్పీసీఐ లింక్, డీబీటీ ఎనేబుల్ చేసుకోవాలి.
  • ప్రతి రైతు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి.

పీఎం కిసాన్ 22వ విడతను మార్చి, ఏప్రిల్ నెలల్లో ఖాతాల్లో జమ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కు ఇటీవల ఓటీపీ ఆధారిత eKYCని
అందుబాటులోకి తెచ్చింది.

Also Read:   రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన చంద్రబాబు

పీఎం కిసాన్ OTP ఆధారిత ఈ-కేవైసీ ఎలా?

  • ఓటీపీ ఆధారిత కేవైసీ పూర్తి చేసేందుకు రైతులు ఆధార్‌తో లింక్ అయిన యాక్టివ్ మొబైల్ నంబర్‌ను కలిగి ఉండాలి.
  • పీఎం కిసాన్ వెబ్ సైట్ https://pmkisan.gov.in/ లింక్ పై క్లిక్ చేయండి.
  • హోంపేజీలో e-KYC ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి ఓటీపీని సబ్మిట్ చేయండి. దీంతో e-KYC పూర్తి అవుతుంది.
  • ఓటీపీ ఆధారిత కేవైసీ పూర్తికాకపోతే.. సీఎస్సీ సెంటర్లలో బయోమెట్రిక్ ద్వారా కేవైసీ పూర్తి చేయవచ్చు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×