E-Paper
Advertisement

PM MODI Elephant Safari: కజిరంగా నేషనల్ పార్క్ లో.. ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ

PM MODI Elephant Safari: కజిరంగా నేషనల్ పార్క్ లో.. ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ

PM MODI Elephant Safari

PM Modi takes elephant safari in Kaziranga National Park(today news telugu): ప్రధాని మోదీకి సాహసాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. ఈ విషయం మనం ఆయన చేసే పనులు బట్టి తెలుసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మోదీ చేసిన పనులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఆ తర్వాత మోదీ సముద్రంలో మునిగిన ద్వారకను సందర్శించి అక్కడ పూజలు చేయడం.. ఇలా రకరకాల సాహసాలు చేస్తూ దేశ ప్రజలను అబ్బురపరుస్తారు. అయితే తాజాగా ప్రధాని మోదీ అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ సంధర్భంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కజిరంగ జాతీయ పార్క్ (Kziranga National park)లో జంగిల్ సఫారీ రైడ్ ను ఎంజాయ్ చేశారు. 1957 తర్వాత ఈ పార్క్ ను సందర్శించిన తొలి ప్రధాని ఈయనే కావడం విశేషం.

రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం మోదీ అస్సాంలోని తేజ్ పుర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మార్చి 8 సాయంత్రం జాతీయ పార్క్ లో ప్రధాని బస చేశారు. ఈ తెల్లవారుజామున అభయారణ్యంలోని సంట్రల్ కొహోరా రేంజ్ ను సందర్శించారు. ఆ తర్వాత జీపులో కొంతసేపు, ఏనుగుపై స్వారీ చేస్తూ కజిరంగా నేషనల్ పార్క్ ను సందర్శించారు. ఆ అరణ్యంలోని ప్రకృతి అందాలను, జంతువులను చిత్రాలను కెమరాలో బంధించారు.

Read more: మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే.. దేశ ప్రజలు, అభివృద్ధి కోసం పనిచేస్తా : ప్రధాని మోదీ

మోదీ వెంట పార్క్ డైరక్టర్ సొనాలి ముఖేష్, అటవీశాఖ సీనియర్ అధికారులు ఉన్నారు. సఫారీ అనంతరం మోదీ ఏనుగులకు చెరుకు గడలను తినిపించారు. ఈ సంధర్బంగా మహిళా ఫారెస్ట్ గార్డ్ లతో ప్రధాని ముచ్చటించారు. కజిరంగా నేషనల్ పార్క్ ను సంధర్శించి , అక్కడ ప్రకృతి దృశ్యాలను, అసమానమైన అందాలను, తప్పకుండా చూడాలని నేను మీ అందరిని కోరుతున్నాను. అని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

పర్యటనలో భాగంగా అస్సాంలోని జోర్ హట్ లో కమాండర్ లచిత్ బర్ఫూకాన్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. ఇక 18 కోట్ల కంటే ఎక్కువ విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ అస్సాంలో ప్రారంభోత్సవం చేయనున్నారు. శౌర్యానికి ప్రతీకగా ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×