BigTV English
Advertisement

PM MODI Elephant Safari: కజిరంగా నేషనల్ పార్క్ లో.. ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ

PM MODI Elephant Safari: కజిరంగా నేషనల్ పార్క్ లో.. ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ

PM MODI Elephant Safari


PM Modi takes elephant safari in Kaziranga National Park(today news telugu): ప్రధాని మోదీకి సాహసాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. ఈ విషయం మనం ఆయన చేసే పనులు బట్టి తెలుసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మోదీ చేసిన పనులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఆ తర్వాత మోదీ సముద్రంలో మునిగిన ద్వారకను సందర్శించి అక్కడ పూజలు చేయడం.. ఇలా రకరకాల సాహసాలు చేస్తూ దేశ ప్రజలను అబ్బురపరుస్తారు. అయితే తాజాగా ప్రధాని మోదీ అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ సంధర్భంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కజిరంగ జాతీయ పార్క్ (Kziranga National park)లో జంగిల్ సఫారీ రైడ్ ను ఎంజాయ్ చేశారు. 1957 తర్వాత ఈ పార్క్ ను సందర్శించిన తొలి ప్రధాని ఈయనే కావడం విశేషం.

రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం మోదీ అస్సాంలోని తేజ్ పుర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మార్చి 8 సాయంత్రం జాతీయ పార్క్ లో ప్రధాని బస చేశారు. ఈ తెల్లవారుజామున అభయారణ్యంలోని సంట్రల్ కొహోరా రేంజ్ ను సందర్శించారు. ఆ తర్వాత జీపులో కొంతసేపు, ఏనుగుపై స్వారీ చేస్తూ కజిరంగా నేషనల్ పార్క్ ను సందర్శించారు. ఆ అరణ్యంలోని ప్రకృతి అందాలను, జంతువులను చిత్రాలను కెమరాలో బంధించారు.


Read more: మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే.. దేశ ప్రజలు, అభివృద్ధి కోసం పనిచేస్తా : ప్రధాని మోదీ

మోదీ వెంట పార్క్ డైరక్టర్ సొనాలి ముఖేష్, అటవీశాఖ సీనియర్ అధికారులు ఉన్నారు. సఫారీ అనంతరం మోదీ ఏనుగులకు చెరుకు గడలను తినిపించారు. ఈ సంధర్బంగా మహిళా ఫారెస్ట్ గార్డ్ లతో ప్రధాని ముచ్చటించారు. కజిరంగా నేషనల్ పార్క్ ను సంధర్శించి , అక్కడ ప్రకృతి దృశ్యాలను, అసమానమైన అందాలను, తప్పకుండా చూడాలని నేను మీ అందరిని కోరుతున్నాను. అని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

పర్యటనలో భాగంగా అస్సాంలోని జోర్ హట్ లో కమాండర్ లచిత్ బర్ఫూకాన్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. ఇక 18 కోట్ల కంటే ఎక్కువ విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ అస్సాంలో ప్రారంభోత్సవం చేయనున్నారు. శౌర్యానికి ప్రతీకగా ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×