PM WANI: వైఫైకి రూ.1000-రూ.2000 చెల్లిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం ఉచిత ఇన్ స్టాలేషన్ తో నెలకు రూ.150కి వైఫై సదుపాయం పొందవచ్చు. మీ వైఫై అదనపు డేటాను విక్రయించి ఆదాయం పొందవచ్చు. PM-WANI పథకం ద్వారా తక్కువ ధరకు వైఫై సదుపాయంతో పాటు అదనపు ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది.
డిజిటల్ విప్లవంలో భాగంగా కేంద్రం పీఎం-వాణి (https://pmwani.gov.in/wani)స్కీమ్ ను అమలు చేస్తుంది. అందరికీ ఇంటర్నెట్ యాక్సెస్ లక్ష్యంతో ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. డబ్బు ఆదాతో పాటు డిజిటల్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఇది సాహయపడుతుంది. ఖరీదైన Wi-Fi లపై డబ్బులు వృధా చేసుకునే కంటే దీనిని ఉపయోగించవచ్చు.
PM-WANI లో పబ్లిక్ డేటా ఆఫీస్ (PDO) వైఫై రౌటర్ ఉంటుంది. ఏదైనా పీడీఓఏ సహకారంతో సబ్స్క్రైబర్లకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందించవచ్చు. సర్టిఫైడ్ పీడీఓఏ జాబితా PM-WANI సెంట్రల్ రిజిస్ట్రీలో అందుబాటులో ఉంది. పీడీఓఏ, ఏపీపీ ప్రొవైడర్లు ప్రభుత్వానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఈ సర్వీసును పొందడానికి పీడీఓలు సర్టిఫైడ్ పీడీఓఏతో సంప్రదించి వైఫై రూటర్, టీఎస్పీ/ఐఎస్పీ నుండి బ్రాడ్బ్యాండ్ /ఎఫ్టీటీహెచ్ కనెక్షన్ను కొనుగోలు చేయాలి.
పీఎం వాణి పథకం ద్వారా వైఫై యూజర్లు వారి వైఫై నెట్వర్క్ను ఇతరులకు షేర్ చేసి ఆదాయం పొందొచ్చు. మీ ఇల్లు లేదా దుకాణంలో వై-ఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే.. మీరు దాన్ని ప్రభుత్వ రిజిస్టర్ సిస్టమ్తో కనెక్ట్ చేసుకోవాలి. తద్వారా మీ డేటాను విక్రయించుకోవచ్చు.
Also Read: Panna News: ఇది కదా అదృష్టం అంటే.. గనిలో తవ్వకాలు జరుపుతుంటే.. క్వాలిటీ వజ్రం లభ్యం
డిజిటల్ ఇండియా మిషన్ లో భాగంగా భారత టెలికాం శాఖ ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించింది. మీకు రౌటర్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే పబ్లిక్ డేటా ఆఫీస్ (PDO)గా కింద మీ వివరాలను ప్రభుత్వ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత మీ నెట్వర్క్ పబ్లిక్ వైఫైగా యాక్టివేట్ చేసుకోవచ్చు. తద్వారా సాధారణ ప్రజలు మీ నెట్వర్క్కు కనెక్ట్ చేసుకుంటారు. అలా మీ డేటా యూసేజ్ ను బట్టి మీకు కమీషన్ వస్తుంది.