BigTV English
Advertisement

Pocso Case on Yediyurappa : బీజేపీకి షాక్.. మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు

Pocso Case on Yediyurappa : బీజేపీకి షాక్.. మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు
former chief minister yediyurappa
former chief minister yediyurappa

Pocso Case on Yediyurappa(Telugu breaking news): లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప(81)పై సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 17 ఏళ్ల బాలికపై ఆయన లైంగిక దాడి చేశారంటూ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 2న తన కుమార్తెను లైంగికంగా వేధించాడని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొంది.


కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప వయసు 81 ఏళ్లు. ఆయన లైంగికంగా వేధించారని చెప్తున్న బాధితురాలి వయసు 17 ఏళ్లు. పోక్సో చట్టంలోని సెక్షన్‌ 8తో పాటు.. ఐపీసీ సెక్షన్ 354A నమోదు చేశారు. ఓ లైంగిక వేధింపుల కేసులో యడియూరప్ప సాయం తీసుకునేందుకు తల్లికూతురు వెళ్లగా.. యడ్డీ కూడా తమ కూతురిపై వేధింపులకు పాల్పడ్డాడని తల్లి ఆరోపిస్తోంది. ఫిబ్రవరి 2వ తేదీన ఆ ఘటన జరిగినట్టు చెప్తోంది. సహాయం కోసం ఆయనను ఆశ్రయిస్తే.. తన కూతురిని బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. పోక్సో చట్టం కింద నేరం రుజువైతే మినిమం మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది.

Also Read : ఎలక్టోరల్ బాండ్ డేటా వెల్లడించిన ఎన్నికల సంఘం.. భారీగా విరాళాలు


కాగా.. ఈ ఆరోపణలపై యడియూరప్ప, ఆయన కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు. కానీ యడ్డీ కార్యాలయం ఈ ఆరోపణలను ఖండించింది. గతంలోనూ వాళ్లు పలువురిపై ఇలాంటి ఆరోపణలు చేశారని, ఇప్పటి వరకూ ఇలా 53 ఫిర్యాదులు చేశారని చెబుతూ ఒక లిస్ట్ ను విడుదల చేసింది. నాలుగుసార్లు కర్ణాటక సీఎంగా పనిచేసిన యడియూరప్ప.. సీఎం పదవిని వీడాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. గతేడాది నవంబర్ లో ఆ బాధ్యతలను ఆయన కుమారుడైన విజయేంద్ర అప్పగించడంతో.. ఆయన ప్రస్తుతం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా ఉన్నారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×