Priyanka Gandhi: కామాంధులు ఎక్కడైనా, ఏ రూపంలోనైనా ఉంటారు. ఆడది కనిపిస్తే చాలు వేధిస్తుంటారు. ప్రేమ పేరుతో ఒకడు.. పెళ్లి పేరుతో ఇంకోడు.. అవకాశాలు ఇప్పిస్తానంటూ మరొకడు. ముందు నైస్గా ట్రాప్ చేస్తారు. తర్వాత అసలు బుద్ధి బయటపెడతారు. లేటెస్ట్గా కాంగ్రెస్ ప్లీనరీలో జరిగిన ఓ ఘటన.. పార్టీలో కలకలం రేపుతోంది. ఏకంగా ప్రియాంక గాంధీ పీకేపైనే కేసు నమోదవడంతో కేడర్ ఉలిక్కిపడుతోంది.
ఆమె పేరు అర్చనా గౌతమ్. మోడల్, నటి కూడా. ఆ తర్వాత బిగ్బాస్లో ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేరఠ్ ప్రాంతంలో మంచి పట్టున్న దళిత నేతగా ఎదిగారు. 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తినాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
కాంగ్రెస్ లీడరే కావడంతో.. ఆమెను ప్రియాక గాంధీ దగ్గర పీఏగా చేస్తున్న సందీప్ సింగ్ మెళ్లిగా లైన్లో పెట్టాడు. ప్రియాంకా గాంధీ అర్చనాను కలవాలని అనుకుంటున్నారంటూ.. రాయ్పుర్లో జరిగే కాంగ్రెస్ ప్లీనరీకి రావాలని ఆమెకు సందీప్ సింగ్ చెప్పాడు. నిజమే అనుకొని అక్కడికి వెళ్లిన అర్చనతో.. సందీప్ సింగ్ అసభ్యంగా ప్రవర్తించాడు. తనకు లొంగకపోతే చంపుతానని బెదిరించాడు.. అంటూ మేరఠ్ పోలీసులకు అర్చనా తండ్రి గౌతమ్ బుద్ధా ఫిర్యాదు చేశాడు. సందీప్ బెదిరింపులపై అర్చన కూడా ఫేస్బుక్లో ఓ వీడియో పెట్టింది.
కేసు నమోదు చేసుకున్న మీరఠ్ పోలీసులు.. ప్రియాంకగాంధీ పీకే సందీప్ సింగ్పై పలు సెక్షన్లలతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రియాంక గాంధీ పీఏ కావడంతో ఈ పరిణామం కాంగ్రెస్లో కల్లోలంగా మారింది.