E-Paper
Advertisement

Raihan Vadra Engagement: ప్రియాంక గాంధీ ఇంట పెళ్లి బాజాలు.. రైహాన్ వాద్రా నిశ్చితార్థం!

Raihan Vadra Engagement: ప్రియాంక గాంధీ ఇంట పెళ్లి బాజాలు.. రైహాన్ వాద్రా నిశ్చితార్థం!
Advertisement

Raihan Vadra Engagement: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఇంట పెళ్లి సందడి మొదలైంది. వారి కుమారుడు రైహాన్ వాద్రా (25) ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన చిరకాల స్నేహితురాలు అవివా బేగ్‌తో రైహాన్ నిశ్చితార్థం ఖరారైంది.

గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న అవివా బేగ్‌కు రైహాన్ నిన్న ఇరువురి కుటుంబాల సమక్షంలో ప్రపోజ్ చేయగా, ఆమె అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ శుభకార్యాన్ని పురస్కరించుకుని రెండు కుటుంబాలు రాజస్థాన్‌లోని రణతంబోర్‌కు చేరుకున్నాయి. రేపు (బుధవారం) రణతంబోర్‌లో వీరి నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాహుల్ గాంధీ సహా గాంధీ, వాద్రా, బేగ్ కుటుంబ సభ్యులు రణతంబోర్‌లోని ప్రసిద్ధ ‘షేర్ బాగ్’ హోటల్‌లో బస చేశారు. వీరు జనవరి 2, 2026 వరకు అక్కడే ఉండి నూతన సంవత్సర వేడుకలను కూడా జరుపుకోనున్నారు. వీరి వివాహం మరో రెండు, మూడు నెలల్లో జరిగే అవకాశం ఉందని కుటుంబ వర్గాలు తెలిపాయి.

Advertisement

అవివా బేగ్ ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఇమ్రాన్ బేగ్, ఇంటీరియర్ డిజైనర్ నందితా బేగ్ కుమార్తె. విశేషమేమిటంటే.. ప్రియాంక గాంధీ, నందితా బేగ్ చాలా కాలంగా మంచి స్నేహితులు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం (ఇందిరా భవన్) ఇంటీరియర్ పనుల్లో ప్రియాంకకు నందితా సహకరించారని సమాచారం. అవివా బేగ్ జర్నలిజం, మీడియా కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేసి, ప్రస్తుతం ఇంటీరియర్ డిజైనర్‌గా, ఫోటోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు.

రైహాన్ వాద్రా డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్, లండన్‌లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS)లో విద్యనభ్యసించారు. చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీపై మక్కువ ఉన్న రైహాన్, విజువల్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు. 2017లో కంటికి గాయమైన తర్వాత ఆయన ‘డార్క్ పెర్సెప్షన్’ పేరుతో ఏర్పాటు చేసిన సోలో ఫోటో ఎగ్జిబిషన్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Advertisement

Read Also: Capital Dome: ఢిల్లీకి అభేద్యమైన రక్షణ కవచం.. డ్రోన్ల వేటకు ‘క్యాపిటల్ డోమ్’!

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×