E-Paper
Advertisement

Rahul Gandhi | గుడి ఎదుట రాహుల్ గాంధీ ధర్నా.. అయోధ్య వేడుక వేళ అస్సాంలో హైడ్రామా!

Rahul Gandhi | అస్సాంలోని హైబోరా గ్రామంలో సోమవారం శ్రీ శ్రీ శంకర్ దేవ్ సత్ర్ మందిర్ అనే దేవాలయంలో ప్రవేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేదని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో రాహుల్ గాంధీ గుడి బయటే నిరసన తెలియజేస్తూ ధర్నాపై బైఠాయించారు.

Rahul Gandhi | గుడి ఎదుట రాహుల్ గాంధీ ధర్నా.. అయోధ్య వేడుక వేళ అస్సాంలో హైడ్రామా!
Advertisement

Rahul Gandhi | అస్సాంలోని హైబోరా గ్రామంలో సోమవారం శ్రీ శ్రీ శంకర్ దేవ్ సత్ర్ మందిర్ అనే దేవాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రవేశం లేదని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో రాహుల్ గాంధీ గుడి బయటే నిరసన తెలియజేస్తూ ధర్నాపై బైఠాయించారు.

రాహుల్ గాంధీ ఇటీవల ప్రారంభించిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ అస్సాంలోని బోద్రోవా థాన్ మందిర్ దేవాలయంలో పూజ చేయడానికి వెళ్లారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆయన భగవాన్ శ్రీ రాముడి స్మరిస్తూ పూజ చేయడానికి వెళుతుండగా.. ఆయనతోపాటు మిగతా కాంగ్రెస్ నాయకులను హైబొరా గ్రామంలో కొంత మంది దేవాలయ సిబ్బంది అడ్డుకున్నారు.

Advertisement

దీంతో రాహుల్ గాంధీ, మిగతా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దేవాలయం ఎదుటే రోడ్డుపై ధర్నా చేస్తూ కూర్చుకున్నారు. ధర్నాలో కూర్చొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై రాహుల్ గాంధీతో పాటు మహిళలు కూడా కూర్చొని ధర్నా చేశారు. అందరూ కలిసి రఘుపతి రాఘవ రాజా రామ్ అంటూ భజనలు పాడారు.

ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేశ్ స్థానిక ప్రభుత్వాధికారులపై మండిపడ్డారు. ”మేమంతా ఒక ప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్నాము. కానీ ఇక్కడ మాతో పాటు ఈ ప్రాంత ఎంపీ గౌరవ్ గోగోయ్‌ని కూడా గుడిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం,” అని అన్నారు.

Advertisement

ఆ తరువాత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ”త్వాధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు. మమ్మల్ని గుడిలో పోనివ్వకుండా ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలి. ప్రధాని మోదీని విమర్శిస్తే.. ఇలా చేస్తారా?.. మేమిక్కడ రాజకీయాలు చేయడం లేదు. కేవలం గుడిలో ప్రశాంతంగా పూజ చేసుకొన వెళ్లిపోతాం. ఇప్పుడు గుడిలో ఎవరు పూజ చేయాలో? ఎప్పుడు పూజ చేయాలో? ప్రధాని మోదీ నిర్ణయిస్తారా?”అని ప్రశ్నించారు.

శ్రీ శ్రీ శంకర్ దేవ్ సత్ర్ మందిర్ లేదా బోద్రోవా థాన్ మందిర్ అని పిలవబడే ఈ దేవాలయంలో సోమవారం సెక్యూరిటీ బందోబస్తు ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. భారీ సంఖ్యలో పోలీసులు గుడి చుట్టూ మోహరించారు. కేవలం ఆ ప్రాంత ఎమ్మెల్యే, ఎంపీకి మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ ఎంపీతో పాటు రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉండడంతో వారిని అనుమతించవద్దని పై నుంచి ఆదేశాలున్నట్లు గుడి సిబ్బంది తెలిపారు.

గుడి సిబ్బంది మీడియాని కూడా దేవాలయ పరిసరాల్లో అనుమతించడం లేదు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు లాల్ జీ దేశాయ్ మాట్లుడుతూ.. ”లో పూజలు చేస్తే సమస్య ఏంటి?.. వాళ్లు ఇలా అడ్డుకోవడం చాలా సిగ్గుచేటు. ప్రధాన మంత్రి మోదీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత.. వీరిద్దరే ఈ ఘటనకు బాధ్యలు. వారి ఆదేశాలతోనే ఇదంతా జరుగుతోంది. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం.” అని అన్నారు.

ఆ తరువాత దేవాలయ కమిటీ అధ్యక్షుడు యోగేంద్ర నారాయణ్ దేవ్ ఈ ఘటనపై స్పందించారు. రాహుల్ గాంధీ ఈ గుడికి వస్తే తనకు చాలా సంతోషంగా ఉంటుందన్నారు. అయోధ్యలో వేడుకల సందర్భంగా ఈ దేవాలయంలో కూడా వేడుకలు చేస్తున్నాము. అందుకే మధ్యాహ్నం 3 గంటల తరువాత రాహుల్ గాంధీ పూజలు చేసుకోవచ్చు. అని అన్నారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×