E-Paper
Advertisement

Anganwadi Protest : విధులకు హాజరుకాకపోతే ఉద్యోగం ఊస్ట్.. డెడ్ లైన్ పై పవన్ కల్యాణ్ ఫైర్..

Anganwadi Protest : విధులకు హాజరుకాకపోతే ఉద్యోగం ఊస్ట్.. డెడ్ లైన్ పై పవన్ కల్యాణ్ ఫైర్..
Advertisement

Anganwadi Protest : మూడు గంటల్లోగా విధులకు హాజరైన వారి ఉద్యోగం ఉంటుంది. లేనివారిది ఊస్టే. ఇది ఏపీలో సమ్మెలో ఉన్న అంగన్వాడీల పరిస్థితి. ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ లోగా డ్యూటీలకు హాజరుకాని వారి స్థానంలో కొత్తవారిని తీసుకునేందుకు జగన్ సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులోభాగంగా ఈ నెల 25న ఏపీలో అంగన్‌వాడీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. 26వ తేదీ నుంచి సచివాలయాల ద్వారా ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు తీసుకోనుంది.

అంగన్వాడీల పోరాటంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు.సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లపై ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరి ప్రజాస్వామ్యయుతంగా లేదని విమర్శించారు. చర్చలు జరపకుండా.. విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు ఇవ్వడాన్నితప్పుపట్టారు. ఆందోళనకారులపై పోలీసు చర్యలు చేపట్టడం సరైన పద్ధతి కాదన్నారు. సీఎం జగన్‌కు కోటి సంతకాలతో వినతి పత్రం ఇచ్చేందుకు ‘చలో విజయవాడ’ కార్యక్రమం చేపడితే పోలీసులు అర్ధరాత్రి వేళ అంగన్ వాడీలను ఈడ్చి వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

Advertisement

అంగన్వాడీల అరెస్టుతో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయన్నారు. ఈ న్యూస్ కవరేజ్ ఇస్తున్న మీడియా సిబ్బందిపైనా విజయవాడలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని పవన్ విమర్శించారు. సీఎం జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అంగన్ వాడీలకు హామీలిచ్చారని గుర్తు చేశారు. పాదయాత్ర సమయంలో జగన్.. పొరుగు రాష్ట్రాల కంటే ఎక్కువ జీతం ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ హామీనే అమలు చేయాలని అంగన్ వాడీలు కోరుతున్నారని అన్నారు. తక్కువ జీతాలకు పని చేస్తున్న అంగన్ వాడీల విషయంలో సానుకూల దృక్పథంతో ఆలోచించాలని జనసేనాని సూచించారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×