BigTV English

Rahul Jodo Yatra : రాహుల్ జోడో యాత్ర.. 1000 కిలోమీటర్లు పూర్తి..

Rahul Jodo Yatra : రాహుల్ జోడో యాత్ర.. 1000 కిలోమీటర్లు పూర్తి..

Rahul Jodo Yatra : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వెయ్యి కిలోమిటర్లు పూర్తి చేసుకొంది. మొత్తం 3వేల 500 కిలోమీటర్ల జోడో యాత్రలో వెయ్యి కిలోమీటర్లు పూర్తి కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందోత్సాహం నెలకొంది. రాహుల్ జోడో యాత్ర ప్రస్తుతం కర్నాటకలో కొనసాగుతోంది. సెప్టెంబర్ 5న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభైన రాహుల్ గాంధీ జోడో యాత్ర..ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా సాగుతోంది. ప్రతీ రోజు సుమారు 25 కిలోమిటర్ల వరకు రాహుల్ నడుస్తున్నారు. ఆయనతో సెల్ఫీ దిగడానికి యువత, పిల్లలు మహిళలు ఉత్సాహం చూపిస్తున్నారు.


ప్రస్తుతం బళ్లారిలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతుండడంతో.. అక్కడి ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. బసవన్న, అంబేడ్కర్, నారాయణ గురు ప్రతిపాదించిన ఐక్యతా సిద్ధాంతం తన పాదయాత్రలో కన్నడీగుల్లో ప్రత్యక్షంగా కనిపిస్తున్నట్లు చెప్పారు. ఈ ఐక్యతను కన్నడీగుల్లోంచి ఎవ్వరూ చెరిపేయలేరన్నారు రాహుల్. తన ప్రసంగంలో ఆర్ఎస్ఎస్, బీజీపీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారి సిద్ధాంతంతో దేశాన్ని ముక్కలు చేస్తున్నారని మండిపడ్డారు.

కార్నాటక ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ పార్టీ దళితులకు, వెనకబడిన తరగతులకు వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. బీజేపీ పాలనలో దళితులపై దాడులు 50 శాతం పెరిగినట్లు చెప్పారు. వారికి కేటాయించిన 8వేల కోట్ల రూపాలయను వేరే వాటికి ఖచ్చుచేశారని అన్నారు. బళ్లారితో తమ కుటుంబానికి ఆత్మీయ బంధం ఉందన్నారు రాహుల్ గాంధీ.అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే సాధ్యమైనంత సేవలను బళ్లారికి అందిస్తామన్నారు.


Related News

CISF Women Commando: పురుషుల ఆధిపత్యానికి ఫుల్‌స్టాప్…. మహిళా కమాండోలు ఎంట్రీ!

Metro Fare Hikes: ప్రయాణికులకు షాక్.. సడన్‌గా చార్జీలు పెంచిన మెట్రో

Rahul Mamkootathil: సినీ నటి ఆరోపణలు.. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రాహుల్ సస్పెండ్

Heavy Rains: దేశాన్ని వణికిస్తున్న వాన బీభత్సం.. విద్యాసంస్థలకు సెలవులు

Delhi News: ఢిల్లీ సీఎం రేఖాపై దాడి కేసు.. తీగలాగితే డొంక కదులుతోంది, కొత్త విషయాలు బయటకు

BJP New Chief: బీజేపీ కొత్త అధ్యక్షులెవరు? ఈసారి ఉత్తరాదికే ఛాన్స్

Big Stories

×