BigTV English
Advertisement

Bihar Elections: చెరువులో ఈత కొడుతూ.. చేపలు పడుతూ.. రాహుల్ గాంధీ ప్రచారం!

Bihar Elections: చెరువులో ఈత కొడుతూ..  చేపలు పడుతూ.. రాహుల్ గాంధీ ప్రచారం!

Bihar Elections: బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకలలో బీజేపీ భారీ ఎన్నికల మోసానికి పాల్పడిందని, ఇప్పుడు బీహార్‌లోనూ ఓటర్ల జాబితాల నుండి పేర్లను తొలగిస్తూ అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు.  56 అంగుళాల ఛాతీ ఉందని చెప్పుకునే మోదీ నిజానికి పిరికివాడని ఆయన అన్నారు. అదానీ, అంబానీలు ప్రధాని మోదీతో కుట్ర పన్నారని, ప్రధాని కూడా వారికి భయపడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.


మహాత్మా గాంధీ శారీరకంగా బలంగా ఉండకపోవచ్చు కానీ ఆయన ఎప్పుడూ బ్రిటిష్ వారికి భయపడలేదని రాహుల్ గాంధీ అన్నారు.  ప్రధానమంత్రి ఇందిరా గాంధీని కూడా అమెరికా బెదిరించడానికి ప్రయత్నించిందని, కానీ ఆమె ఎప్పుడూ చలించలేదని ఆయన అన్నారు. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో, యుద్ధాన్ని ఆపమని అమెరికా నావికాదళం ఆమెపై ఒత్తిడి తెచ్చింది. కానీ ఆమె “మీకు నచ్చింది చేయండి. కానీ మేము వెనక్కి తగ్గలేము” అని నిరాకరించినట్లు రాహుల్ గుర్తు చేశారు.

READ ALSO: Perplexity: చాలా మందికి తెలియని రాజకీయ నాయకుల “గుట్టును” బయటపెట్టబోతున్న పెర్‌ప్లెక్సిటీ AI


బీహార్‌లో మహా కూటమి గెలుస్తోందని, అయినప్పటికీ ప్రజలు తమ పోలింగ్ బూత్‌ల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ఓటును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. “ప్రజాస్వామ్యంలో మీ ఓటు మీ అత్యంత శక్తివంతమైన ఆయుధం” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదే ప్రచార పర్యటనలో భాగంగా, రాహుల్ బెగుసరాయి ప్రాంతంలో సరదాగా గడిపారు. స్థానిక అభ్యర్థి ముఖేష్ సహానీతో కలిసి ఆయన ఓ చెరువులోకి దిగి ఈత కొట్టారు. అనంతరం మత్స్యకారులతో కలిసి చేపలు పడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 

 

Related News

Perplexity: చాలా మందికి తెలియని రాజకీయ నాయకుల “గుట్టును” బయటపెట్టబోతున్న పెర్‌ప్లెక్సిటీ AI

Student Jumps from 4th floor: స్కూల్‌‌లో 4వ అంతస్తు నుంచి దూకి 6వ తరగతి విద్యార్థిని మృతి…

Argument In Bengaluru: బెంగళూరులో వాగ్వాదం తర్వాత ఉద్దేశపూర్వకంగా బైక్‌ను ఢీకొట్టిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్

Bihar Politics: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. ప్రశాంత్ కిశోర్ పార్టీ నేత హత్య, నితీష్ పార్టీ అభ్యర్థి అరెస్టు

Sabarimala Gold Theft: శబరిమల బంగారం వివాదంలో ట్విస్ట్.. 2019 లోనే రాగిగా మార్చేసి!! ఎంత చోరీ అయ్యిందంటే

PM Modi: ఛత్తీస్‌గఢ్ పర్యటనకు ప్రధాన మోదీ.. రూ.14,000 కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపన

Saudi Crime: ఎన్‌కౌంటర్లో చిక్కుకున్నాడు.. చనిపోయే ముందు భార్యకు వాయిస్ నోట్ పంపాడు!

Big Stories

×