E-Paper
Advertisement

GST Council Meeting: ఫ్లాట్‌ఫామ్ టికెట్స్, బ్యాటరీ కార్లకు ఇకనుంచి నో జీఎస్టీ

GST Council Meeting: ఫ్లాట్‌ఫామ్ టికెట్స్, బ్యాటరీ కార్లకు ఇకనుంచి నో జీఎస్టీ
Advertisement

GST Council Meeting: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ పాలక మండలి సమావేశం పలు నిర్ణయాలను తీసుకుంది. రైల్వేలు, ప్రయాణికులకు అందించే పలు సేవలను జీఎస్టీ నుంచి మినహాయించాలని తీర్మానించింది. ఇందులో ప్రయాణికుల విశ్రాంతి గదులు, లగేజీ సేవలు, రైల్వే ఫ్లాట్ పామ్ టికెట్స్, బ్యాటరీ ద్వారా నడిచే కార్ల సేవలు ఉన్నాయి. విద్యా సంస్థలకు చెందిన వసతి గృహాల్లో కాకుండా బయట ఉంటున్న వాళ్లకు నెలకు రూ. 20 వేల వరకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని పాలకమండలి సిఫారసు చేసింది.

స్టీల్, ఇనుము, అల్యూమినియంతో తయారు చేసిన పాల క్యాన్లపై 12 శాతం జీఎస్టీ ఉంటుంది. అన్ని కార్టన్ బాక్సులపై జీఎస్టీ 12 శాతం తగ్గింపు. దీని ద్వారా యాపిల్‌తో పాటు పలు పండ్ల వ్యాపారులకు మేలు కలుగుతుంది. స్ప్రింకర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గించారు. మరో వైపు, పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ విషయంపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని వెల్లడించారు. చిరు వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. కౌన్సిల్ ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.

Advertisement

గత సమావేశం అక్టోబర్‌లో నిర్వహించాం. ఎన్నికల కోడ్ కారణంగా జీఎస్టీ కౌన్సిల్ భేటీ చాలా రోజులుగా జరగలేదు. ప్రస్తుతం జీఎస్టీ కౌన్సిల్‌లో అనేక విషయాలు చర్చించాం. పన్నులు కట్టే వారికి అనేకమైన అనుకూల నిర్ణయాలు తీసుకున్నాం. చిన్న వ్యాపారులకు మేలు జరిగేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఉన్నాయి. ఇన్‌పుట్ క్రెడిట్ ట్యాక్స్ విషయంలో కూడా మార్పులు చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

Advertisement

 

Tags

Related News

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

Advertisement
×