Padma Awards 2025 : దేశంలో గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మా అవార్డులను ప్రకటించింది. విభిన్న రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలతో సత్కరించనుంది. గణతంత్ర వేడుకల సందర్భంగా.. రాష్ట్రపతి చేతుల మీదుగా వీరికి ఈ అవార్డులను బహుకరించనున్నారు.
పద్మశ్రీ అవార్డులు :
- జోనస్ మాశెట్టి (వేదాంత గురు) – బ్రెజిల్
- హర్వీందర్సింగ్ (పారాలింపియన్ గోల్డ్మెడల్ విన్నర్) – హరియాణా
- భీమ్ సింగ్ భవేష్ (సోషల్వర్క్) – బిహార్
- పి.దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు)- పుదుచ్చేరి
- ఎల్.హంగ్థింగ్ (వ్యవసాయం-పండ్లు)- నాగాలాండ్
- బేరు సింగ్ చౌహాన్ (జానపద గాయకుడు) – మధ్యప్రదేశ్
- షేఖా ఎ.జె. అల్ సబాహ్ (యోగా)- కువైట్
- నరేన్ గురుంగ్ (జానపద గాయకుడు) – నేపాల్
- హరిమన్ శర్మ (యాపిల్ సాగుదారు) – హిమాచల్ ప్రదేశ్
- జుమ్దే యోమ్గామ్ గామ్లిన్ (సామాజిక కార్యకర్త)- అరుణాచల్ ప్రదేశ్
- విలాస్ దాంగ్రే (హోమియోపతి వైద్యుడు) – మహారాష్ట్ర
- వెంకప్ప అంబానీ సుగటేకర్ (జానపద గాయకుడు) – కర్ణాటక
- నిర్మలా దేవి (చేతి వృత్తులు) – బిహార్
- జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు)- అస్సాం
- సురేశ్ సోనీ (సోషల్వర్క్- పేదల వైద్యుడు)- గుజరాత్
- రాధా బహిన్ భట్ (సామాజిక కార్యకర్త)- ఉత్తరాఖండ్
- పాండి రామ్ మాండవి (కళాకారుడు) – ఛత్తీస్గఢ్
- లిబియా లోబో సర్దేశాయ్ (స్వాతంత్ర్య సమరయోధురాలు) – గోవా
- గోకుల్ చంద్ర దాస్ (కళలు)- పశ్చిమ బెంగాల్
- సాల్లీ హోల్కర్ (చేనేత)- మధ్యప్రదేశ్
- మారుతీ భుజరంగ్రావు చిటమ్పల్లి (సాంస్కృతికం, విద్య)- మహారాష్ట్ర
- బతూల్ బేగమ్ (జానపద కళాకారిణి) – రాజస్థాన్
- వేలు ఆసన్ (డప్పు వాద్యకారుడు) – తమిళనాడు
- భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లేక్యాతర (తోలుబొమ్మలాట) – కర్ణాటక
- పర్మార్ లావ్జీభాయ్ నాగ్జీభాయ్ (చేనేత)- గుజరాత్
- విజయలక్ష్మి దేశ్మానే (వైద్యం)- కర్ణాటక
- చైత్రం దేవ్చంద్ పవార్ (పర్యావరణ పరిరక్షణ)- మహారాష్ట్ర
- జగదీశ్ జోషిలా (సాహిత్యం)- మధ్యప్రదేశ్
- నీర్జా భట్లా (గైనకాలజీ) – దిల్లీ
- హ్యూ, కొల్లీన్ గాంట్జర్ (సాహిత్యం, విద్య -ట్రావెల్) ఉత్తరాఖండ్
భారత దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన వివిధ రంగాలకు చెందిన వారికి కేంద్ర ఈ పురస్కారాల్ని అందిస్తుంటుంది. ఏటా గణతంత్ర దినోత్సవం రోజున వీటిని ప్రకటిస్తుంటారు. పద్మా అవార్డులు మూడు వర్గాలుగా విభజించి ఇస్తుంటారు. ఆయా రంగాల్లో వాళ్లు చేసిన కృషిని గుర్తిస్తూ.. ఈ మూడు విభాగాల్లో అవార్డులు అందిస్తుంటారు.
పద్మ విభూషణ (Padma Vibhushan) పౌర పురస్కారాల్లో అత్యున్నత పురస్కారం. వ్యక్తిగత సేవలు, ప్రత్యేక రంగాల్లో విశిష్ట కృషి చేసిన వారికి ఈ పురస్కారం అందిస్తుంటారు.
పద్మభూషణ (Padma Bhushan): దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం. దేశంలోని వివిధ రంగాల్లో కృషి చేసిన వ్యక్తులకు ఈ పురస్కారాన్ని అందిస్తుంటారు.
పద్మశ్రీ (Padma Shri) : మూడో అత్యున్నత పురస్కారంగా భావించే పద్మశ్రీ అవార్డులను.. గొప్ప సేవలు, కళలు, సాహిత్యం, పౌర సేవలు, విజ్ఞానం, శాస్త్ర, సాంస్కృతిక రంగాలలో అసాధారణ కృషికి గుర్తింపుగా అందిస్తుంటారు.

Share