BigTV English

Padma Awards 2025 : పద్మా పురస్కారాల్ని ప్రకటించిన కేంద్రం.. ఈ ఏడాది అవార్డులు అందుకోనున్న వాళ్లు వీళ్లే

Padma Awards 2025 : పద్మా పురస్కారాల్ని ప్రకటించిన కేంద్రం.. ఈ ఏడాది అవార్డులు అందుకోనున్న వాళ్లు వీళ్లే

Padma Awards 2025 :  దేశంలో గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మా అవార్డులను ప్రకటించింది. విభిన్న రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలతో సత్కరించనుంది. గణతంత్ర వేడుకల సందర్భంగా.. రాష్ట్రపతి చేతుల మీదుగా వీరికి ఈ అవార్డులను బహుకరించనున్నారు.


పద్మశ్రీ అవార్డులు : 

  1. జోనస్‌ మాశెట్టి  (వేదాంత గురు) – బ్రెజిల్‌
  2. హర్వీందర్‌సింగ్‌ (పారాలింపియన్‌ గోల్డ్‌మెడల్‌ విన్నర్‌) – హరియాణా
  3. భీమ్‌ సింగ్‌ భవేష్‌ (సోషల్‌వర్క్‌) – బిహార్‌
  4. పి.దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు)- పుదుచ్చేరి
  5. ఎల్‌.హంగ్‌థింగ్‌ (వ్యవసాయం-పండ్లు)- నాగాలాండ్‌
  6. బేరు సింగ్‌ చౌహాన్‌ (జానపద గాయకుడు) – మధ్యప్రదేశ్‌
  7. షేఖా ఎ.జె. అల్ సబాహ్‌ (యోగా)- కువైట్‌
  8. నరేన్‌ గురుంగ్‌ (జానపద గాయకుడు) – నేపాల్‌
  9. హరిమన్‌ శర్మ (యాపిల్‌ సాగుదారు) – హిమాచల్‌ ప్రదేశ్‌
  10. జుమ్దే యోమ్‌గామ్‌ గామ్లిన్‌ (సామాజిక కార్యకర్త)- అరుణాచల్‌ ప్రదేశ్‌
  11. విలాస్‌ దాంగ్రే (హోమియోపతి వైద్యుడు) – మహారాష్ట్ర
  12. వెంకప్ప అంబానీ సుగటేకర్‌ (జానపద గాయకుడు) – కర్ణాటక
  13. నిర్మలా దేవి (చేతి వృత్తులు) – బిహార్‌
  14. జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు)- అస్సాం
  15. సురేశ్‌ సోనీ (సోషల్‌వర్క్‌- పేదల వైద్యుడు)- గుజరాత్‌
  16. రాధా బహిన్‌ భట్‌ (సామాజిక కార్యకర్త)- ఉత్తరాఖండ్‌
  17. పాండి రామ్‌ మాండవి (కళాకారుడు) – ఛత్తీస్‌గఢ్‌
  18. లిబియా లోబో సర్దేశాయ్‌ (స్వాతంత్ర్య సమరయోధురాలు) – గోవా
  19. గోకుల్‌ చంద్ర దాస్‌ (కళలు)- పశ్చిమ బెంగాల్‌
  20. సాల్లీ హోల్కర్‌ (చేనేత)- మధ్యప్రదేశ్‌
  21. మారుతీ భుజరంగ్‌రావు చిటమ్‌పల్లి (సాంస్కృతికం, విద్య)- మహారాష్ట్ర
  22. బతూల్‌ బేగమ్‌ (జానపద కళాకారిణి) – రాజస్థాన్‌
  23. వేలు ఆసన్‌ (డప్పు వాద్యకారుడు) – తమిళనాడు
  24. భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లేక్యాతర (తోలుబొమ్మలాట) – కర్ణాటక
  25. పర్మార్‌ లావ్జీభాయ్‌ నాగ్జీభాయ్‌ (చేనేత)- గుజరాత్
  26. విజయలక్ష్మి దేశ్‌మానే (వైద్యం)- కర్ణాటక
  27. చైత్రం దేవ్‌చంద్‌ పవార్‌ (పర్యావరణ పరిరక్షణ)- మహారాష్ట్ర
  28. జగదీశ్‌ జోషిలా (సాహిత్యం)- మధ్యప్రదేశ్‌
  29. నీర్జా భట్లా (గైనకాలజీ) – దిల్లీ
  30. హ్యూ, కొల్లీన్‌ గాంట్జర్‌ (సాహిత్యం, విద్య -ట్రావెల్‌) ఉత్తరాఖండ్‌

భారత దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన వివిధ రంగాలకు చెందిన వారికి కేంద్ర ఈ పురస్కారాల్ని అందిస్తుంటుంది. ఏటా గణతంత్ర దినోత్సవం రోజున వీటిని ప్రకటిస్తుంటారు. పద్మా అవార్డులు మూడు వర్గాలుగా విభజించి ఇస్తుంటారు. ఆయా రంగాల్లో వాళ్లు చేసిన కృషిని గుర్తిస్తూ.. ఈ మూడు విభాగాల్లో అవార్డులు అందిస్తుంటారు.


పద్మ విభూషణ (Padma Vibhushan) పౌర పురస్కారాల్లో అత్యున్నత పురస్కారం. వ్యక్తిగత సేవలు, ప్రత్యేక రంగాల్లో విశిష్ట కృషి చేసిన వారికి ఈ పురస్కారం అందిస్తుంటారు.

పద్మభూషణ (Padma Bhushan): దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం. దేశంలోని వివిధ రంగాల్లో కృషి చేసిన వ్యక్తులకు ఈ పురస్కారాన్ని అందిస్తుంటారు.

పద్మశ్రీ (Padma Shri) : మూడో అత్యున్నత పురస్కారంగా భావించే పద్మశ్రీ అవార్డులను..  గొప్ప సేవలు, కళలు, సాహిత్యం, పౌర సేవలు, విజ్ఞానం, శాస్త్ర, సాంస్కృతిక రంగాలలో అసాధారణ కృషికి గుర్తింపుగా అందిస్తుంటారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×