E-Paper
Advertisement

Delhi-77th Republic Day: భారత సత్తా చాటేలా.. భద్రతా కోటలో 77వ గణతంత్ర వేడుకలు

Delhi-77th Republic Day: భారత సత్తా చాటేలా.. భద్రతా కోటలో 77వ గణతంత్ర వేడుకలు

Delhi-77th Republic Day: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరి ముఖ్యంగా ఢిల్లీలోని ఇండియా గేట్, రెడ్ ఫోర్ట్, చాందిని చౌక్, జామా మసీద్, ఎయిర్ పోర్ట్ రైల్వేస్టేషన్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఢిల్లీలో పదివేల మంది భద్రత సిబ్బంది పహార కాస్తున్నారు.

వీరితో పాటు పారా మిలటరీ బలగాలు, ఢిల్లీ పోలీసులు, 1000 సీసీ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు భద్రతలో భాగంగా ఉన్నాయి. ఎక్కడి కక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న తొలి గణతంత్ర దినోత్సవం వేడుకలు కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత ప్రభుత్వం ఈ వేడుకలను నిర్వహిస్తోంది.

ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత మధ్య వేడుకలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జమ్మూ కాశ్మీర్ అడవుల్లో ఉన్న ఉగ్రవాదులను, చొరబాటు దారులను మట్టు పెట్టేందుకు సరిహద్దుల్లో 24 గంటలు పహారాకాస్తున్నారు. రెడ్ఫోర్ట్ వద్ద జరిగిన కారు పేలుడు ఘటన లాంటివి పునరావృతం కాకుండా ఉండే విధంగా భారత ప్రభుత్వం భద్రత ను పర్యవేక్షిస్తుంది.

ALSO READ:మున్సిపల్ ఎన్నికల శంఖారావం.. నిజామాబాద్ వేదికగా ఉత్తమ్, మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటనలు!

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×