Republic Day-2026: దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో కర్తవ్యపథ్లో జరుగుతున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది భారీ ఎత్తున వేడుకలను నిర్వహిస్తోంది కేంద్రప్రభుత్వం. ఈసారి రిపబ్లిక్ డే వేడుకల ప్రదర్శనలో 30 శకటాలు పాల్గొననున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందినవి 17 శకటాలు ఉండనున్నాయి. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి 13 శకటాలు కూడా ఉన్నాయి.