E-Paper
Advertisement

Deaths: ఆకస్మిక మరణాలపై ఫోకస్.. రంగంలోకి అపెక్స్ మెడికల్ రీసెర్చ్..

Deaths: ఆకస్మిక మరణాలపై ఫోకస్.. రంగంలోకి అపెక్స్ మెడికల్ రీసెర్చ్..
Advertisement
heart stroke

Deaths: దేశంలో పోస్ట్ కొవిడ్ మరణాలు భారీగా నమోదవుతున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. వీటిల్లో కార్డియాక్ ఎటాక్ తో చనిపోతున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్నవారి మరణాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

పెరిగిపోతున్న ఆకస్మిక మరణాలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దృష్టిపెట్టింది. అపెక్స్ మెడికల్ రీసెర్చ్ బాడీతో కలిసి కొవిడ్ అనంతరం యువకుల “ఆకస్మిక మరణాల”పై పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. ఉన్నట్టుండి మరణిస్తున్న వారిపై అధ్యయనాలు ప్రారంభించింది.

Advertisement

ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్.. 18 నుండి 45 సంవత్సరాల వయస్సు గల మరణాలను పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు. గుజరాత్‌ గాంధీనగర్‌లో జరిగిన గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన.. ఎలాంటి కారణాలు లేకుండా సంభవిస్తున్న ఆకస్మిక మరణాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గుండెపోటు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ఆకస్మిక మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించారు.

కొవిడ్ తర్వాత యువత ఆకస్మిక మరణాలలోకు కారణమవుతున్న.. శారీరక మార్పులపై ICMR అధ్యయనం చేస్తోంది. ఇందుకోసం ICMR గత సంవత్సరంలో 18 నుంచి 45 ఏళ్ల వయస్సులో ఆకస్మికంగా మృతి చెందిన వారి డేటాను ఉపయోగించుకుంటోంది.

Advertisement

దేశంలోని 40 కేంద్రాల నుంచి డేటాను తెప్పించుకున్న ICMR.. చనిపోయినవారి కొవిడ్ అడ్మిషన్లు, హాస్పిటల్ డిశ్చార్జ్, వారి ఆరోగ్య సమస్యలను అధ్యయనం చేయనుంది. ఆయా వ్యక్తుల ఆహారపు అలవాట్లు, పొగాకు వినియోగం, జీవనశైలి, కోవిడ్ చరిత్ర, టీకా, ఫ్యామిలీ హెల్త్ హిస్టరీని కూడా అధ్యయనం చేస్తోంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×