E-Paper
Advertisement

Samruddhi Mahamarg: వంతెన మీద మేకులు.. వందలాది వాహనాలు పంక్చర్.. ఈ కుట్రకు కారకులెవరు?

Samruddhi Mahamarg: వంతెన మీద మేకులు.. వందలాది వాహనాలు పంక్చర్..  ఈ కుట్రకు కారకులెవరు?

Samruddhi Mahamarg: సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ హైవేపై జరిగిన ఒక సంఘటన రాత్రికి రాత్రే సోషల్ మీడియా వైరల్ అయ్యింది. నాగ్‌పూర్‌ నుండి ముంబై వైపు వెళ్తున్న వాహనాలు అకస్మాత్తుగా ఆగిపోయే పరిస్థితి తలెత్తింది. అంతేకాదు ప్రయాణికుల కార్లు, బైకులు అక్కడి నుంచి ప్రయాణించడంతో ఒక్కసారిగా పేలిపోయాయి. కారణం వంతెనపై రోడ్డు మధ్య వరుసలుగా పొడవైన మేకులు బయటికి కనిపించడం. కార్ల టైర్లు పగిలిపోవడంతో డ్రైవర్లు ఆందోళనకు గురయ్యారు. మొదట ప్రయాణికులు ఇది ఎవరైనా దొంగల గుంపు చేసిన పనేమోనని అనుమానించారు. కానీ తర్వాత తెలిసింది అసలు విషయం వేరేనని. రోడ్ మరమ్మత్తు పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ సంస్థ ఈ మేకులు తాత్కాలికంగా అమర్చిందని అధికారులే ధృవీకరించారు.

హెచ్చరిక బోర్డు లేవు

వాస్తవానికి, ఆ ప్రాంతంలో రహదారిపై చిన్న పగుళ్లు కనిపించాయి. వాటిని సరిచేయడానికి ఇంజనీర్లు ఎపాక్సీ గ్రౌటింగ్‌ పద్ధతిని ఉపయోగించారు. ఇందులో అల్యూమినియం నాజిల్స్‌ని రోడ్డులో అమర్చి చీలికలు మూసే ప్రక్రియ జరుగుతుంది. కానీ, ఈ నాజిల్స్ పూర్తిగా తీసివేయక ముందే కొంతమంది డ్రైవర్లు దారి గుండా వెళ్లడంతో టైర్లు పగిలిపోయాయి. ఈ సంఘటన రాత్రి సమయంలోనే జరగడంతో, ఎటువంటి బ్యారీకేడ్లు లేకపోవడం, డ్రైవర్లకు హెచ్చరికలేమీ లేకపోవడంతో ప్రయాణికులు అక్కడి నుంచి ప్రయాణించారు. దీని వల్ల వేగంగా వెళ్తున్న వాహనాలకు టైర్లు పగిలిపోవడం వల్ల పెద్ద ప్రమాదం కూడా జరగవచ్చని నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తారు.

Also Read: Bigg Boss 9 Telugu Day 3 – Promo 2: ‘సుత్తి’ కొట్టిన సుమన్‌ శెట్టి.. ప్రియా వర్సెస్‌ రాము రాథోడ్‌.. కొత్త ప్రోమో అదిరింది..

దొంగల పనికాదు మరమ్మత్తు పనులు

రహదారి వంతెనలపై మేకులు అమర్చుతారా? ప్రయాణికులకు ఏమైన జరిగితే ఎవరు బాధ్యులు? అంటూ మండిపడుతున్నారు. ప్రమాద హెచ్చరికలు గానీ, అక్కడ లైటింగ్ కానీ అమర్చకుండా ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు అని ప్రయాణికులు మండిపడుతున్నారు. దీనిపై వీడియో తీసి కొందరు ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రాత్రికి రాత్రే వైరల్ గా మారింది. దీంతో వీడియో వైరల్‌ కావడంతో మహారాష్ట్ర స్టేట్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (MSRDC) వెంటనే స్పష్టీకరణ ఇచ్చింది. దొంగల పని కాదని, ఇది మరమ్మత్తు ప్రక్రియలో భాగమేనని, అయితే రాత్రివేళ రిపేర్‌ చేయడం వల్లే డ్రైవర్లు ఇబ్బంది పడ్డారని అంగీకరించింది. అయితే సింపుల్ ఆ మాటలు చెప్పి సైడ్ అయిపోయింది.

జరిగింది ఇదీ..

సమృద్ధి మహామార్గ్‌లో చైన్ నంబర్ 442+460 సమీపంలోని రెండు లేన్‌లలో చిన్న చీలికలు కనిపించాయి. రోడ్డు నాణ్యతను కాపాడేందుకు ఈ చీలికలను ఇపాక్సీ గ్రౌటింగ్ ద్వారా పూర్చడం జరిగింది. ఈ పనికి అల్యూమినియం నోజిల్స్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అక్కడ జరుగుతున్న పనుల సమయంలో ట్రాఫిక్‌ను పలు మార్గాల్లో మళ్లించారు. అయినప్పటికీ, కొన్ని వేగంగా వెళ్తున్న వాహనాలను నిబంధనలను పాటించక, మొదటి లేన్‌లోకి దూసుకెళ్లాయి. దీనివల్ల అల్యూమినియం నోజిల్స్ పై వెళ్ళిన వాహనాల టైర్లు చీలిపోయాయి. ఈ ఘటన 10 సెప్టెంబర్ మధ్యాహ్నం 12.10 గంటలకు జరిగింది. హైవే పేట్రోల్ టీమ్ 25 నిమిషాల్లో ఘటన స్థలానికి చేరింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఎవరికి గాయాలు కాలేదని తెలిపారు.

రిపేర్ కోసం ఉపయోగించిన అన్ని అల్యూమినియం నాజిల్స్ 10 సెప్టెంబర్ ఉదయం 5 గంటలకు తొలగించారు. ఇప్పటివరకు ట్రాఫిక్ సక్రమంగానే నడుస్తోంది. టైర్ పంచర్లు అల్యూమినియం (నాజిల్స్) పరికరాల వల్ల సంభవించాయి. అక్కడ అమర్చిన నీల్స్ (small aluminium nozzles) వల్ల కాదని స్పష్టం చేశారు. రోడ్డు మీద ఉద్దేశపూర్వకంగా టైర్స్ పంచర్స్ చేయడానికి ఎలాంటి నీల్స్ పెట్టలేదు. అదనంగా, డైవర్షన్ పాయింట్ వద్ద సరైన ట్రాఫిక్ సెక్యూరిటీ ఏర్పాట్లు లేకపోవడం కూడా సమస్యకు కారణమని గుర్తించారు. కాబట్టి, ఆ సైట్ నిర్వహణకు బాధ్యత వహించిన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

వైరల్ రిపోర్ట్స్ వలన వాహనదారులు, స్థానికులు భయ భ్రాంతికి గురయ్యారని MSRDC తెలిపింది. ఎప్పుడూ రోడ్డు డైవర్షన్ సూచనలను గౌరవించండి, స్పీడ్ పరిమితులను పాటించాలని ప్రజలను సూచించింది. ఇటువంటివి పాటిస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉంటాయని పేర్కొంది. హెచ్చరికలకు అనుగుణంగా ప్రయాణించడం తప్పనిసరిగా చేయాలని MSRDC సూచించింది.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×