BigTV English

Samruddhi Mahamarg: సమృద్ధి మహామార్గ్ ఘటన.. అసలు కారణం ఇదే

Samruddhi Mahamarg: సమృద్ధి మహామార్గ్ ఘటన.. అసలు కారణం ఇదే

Samruddhi Mahamarg: సమృద్ధి మహామార్గ్‌పై ఇటీవల టైర్లు పేలిన ఘటనపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వార్తపై మహారాష్ట్ర రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MSRDC) క్లారిటీ ఇచ్చింది. ప్రజల్లో అపోహలు వ్యాప్తి చెందకుండా చూడాలనే ఉద్దేశంతో అక్కడ పరిస్థితిని వివరించారు.


అక్కడ జరిగింది ఇదీ.. 

సమృద్ధి మహామార్గ్‌లో చైన్ నంబర్ 442+460 సమీపంలోని రెండు లేన్‌లలో చిన్న చీలికలు కనిపించాయి. రోడ్డు నాణ్యతను కాపాడేందుకు ఈ చీలికలను ఇపాక్సీ గ్రౌటింగ్ ద్వారా పూర్చడం జరిగింది. ఈ పనికి అల్యూమినియం నోజిల్స్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అక్కడ జరుగుతున్న పనుల సమయంలో ట్రాఫిక్‌ను పలు మార్గాల్లో మళ్లించారు. అయినప్పటికీ, కొన్ని వేగంగా వెళ్తున్న వాహనాలను నిబంధనలను పాటించక, మొదటి లేన్‌లోకి దూసుకెళ్లాయి. దీనివల్ల అల్యూమినియం నోజిల్స్ పై వెళ్ళిన వాహనాల టైర్లు చీలిపోయాయి. ఈ ఘటన 10 సెప్టెంబర్ మధ్యాహ్నం 12.10 గంటలకు జరిగింది. హైవే పేట్రోల్ టీమ్ 25 నిమిషాల్లో ఘటన స్థలానికి చేరింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఎవరికి గాయాలు కాలేదని తెలిపారు.


Also Read: Bigg Boss 9 Telugu Day 3 – Promo 2: ‘సుత్తి’ కొట్టిన సుమన్‌ శెట్టి.. ప్రియా వర్సెస్‌ రాము రాథోడ్‌.. కొత్త ప్రోమో అదిరింది..

ఉద్దేశపూర్వకంగా జరగలేదు

MSRDC తెలిపినట్లుగా, రిపేర్ కోసం ఉపయోగించిన అన్ని అల్యూమినియం నాజిల్స్ 10 సెప్టెంబర్ ఉదయం 5 గంటలకు తొలగించారు. ఇప్పటివరకు ట్రాఫిక్ సక్రమంగానే నడుస్తోంది. టైర్ పంచర్లు అల్యూమినియం (నాజిల్స్) పరికరాల వల్ల సంభవించాయి. అక్కడ అమర్చిన నీల్స్ (small aluminium nozzles) వల్ల కాదని స్పష్టం చేశారు. రోడ్డు మీద ఉద్దేశపూర్వకంగా టైర్స్ పంచర్స్ చేయడానికి ఎలాంటి నీల్స్ పెట్టలేదు. అదనంగా, డైవర్షన్ పాయింట్ వద్ద సరైన ట్రాఫిక్ సెక్యూరిటీ ఏర్పాట్లు లేకపోవడం కూడా సమస్యకు కారణమని గుర్తించారు. కాబట్టి, ఆ సైట్ నిర్వహణకు బాధ్యత వహించిన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

జాగ్రత్తలు పాటించండి

వైరల్ రిపోర్ట్స్ వలన వాహనదారులు, స్థానికులు భయ భ్రాంతికి గురయ్యారని MSRDC తెలిపింది. ఎప్పుడూ రోడ్డు డైవర్షన్ సూచనలను గౌరవించండి, స్పీడ్ పరిమితులను పాటించాలని ప్రజలను సూచించింది. ఇటువంటివి పాటిస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉంటాయని పేర్కొంది. హెచ్చరికలకు అనుగుణంగా ప్రయాణించడం తప్పనిసరిగా చేయాలని MSRDC సూచించింది.

Related News

Indian Constitution: పొరుగు దేశాలు చూశారా ఎలా ఉన్నాయో.. నేపాల్, బంగ్లాదేశ్‌లపై.. భారత సుప్రీం కోర్డు కీలక వ్యాఖ్యలు

Nepal Viral Video: మా హోటల్‌కు నిప్పు పెట్టారు.. బయటకు వెళ్లలేని పరిస్థితి.. నేపాల్‌లో భారత మహిళకు భయానక అనుభవం

Nepal Protests: భారత్-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్తతలు! విమాన సర్వీసుల నిలిపివేత..

Modi-Trump: మోదీ–ట్రంప్ వాణిజ్య చర్చలు.. ఎక్స్ వేదికగా ప్రకటన

Vice President: భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్..

Big Stories

×