E-Paper
Advertisement

Rahul Gandhi : దేశ రాజకీయాల్లో కొత్త మార్పు.. రాహుల్ పై సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Rahul Gandhi : దేశ రాజకీయాల్లో కొత్త మార్పు.. రాహుల్ పై సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Advertisement

Rahul Gandhi : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వచ్చింది. రాహుల్ ఇమేజ్ రోజురోజుకు పెరుగుతోంది. సామాన్యులతో ఆయన మమేకమవుతున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇలా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర సాగిస్తున్న రాహుల్ కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్తచర్చకు దారితీశాయి.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నాయకత్వం 2022లో కొత్త వైభవం సంతరించుకుందని సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. ఈ వైభవం 2023లోనూ కొనసాగితే.. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి దేశ రాజకీయాల్లో కొత్త మార్పు వస్తుందని జోస్యం చెప్పారు. ప్రతి ఆదివారం పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో రాసే వ్యాసంలో ఈ విషయాన్ని సంజయ్ రౌత్ ప్రస్తావించారు. 2023లోనైనా భారత్‌ భయం గుప్పిట్లో నుంచి బయటపడాలన్నారు. రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర విజయవంతమవ్వాలని ఆకాంక్షించారు.

Advertisement

మరోవైపు బీజేపీపైనా రౌత్‌ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దేశంలో విద్వేష, విభజన విత్తనాలు నాటొద్దని హితవు పలికారు. సంకుచిత ఆలోచనా ధోరణిని విడనాడాలని మోదీ తరచూ చెబుతూ ఉంటారని కానీ ఆ వైఖరి బీజేపీలోనే అధికంగా ఉందన్నారు. విపక్ష పార్టీలకు ఉన్న హక్కుల్ని గుర్తించడానికి పాలకులు సుముఖంగా లేరని మండిపడ్డారు.


రామ మందిర నిర్మాణ అంశానికి పరిష్కారం దొరికిందని సంజయ్ రౌత్ తెలిపారు. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకొని ఓట్లు అడిగే పరిస్థితులు లేవన్నారు. ఈ నేపథ్యంలో లవ్‌ జిహాదీ అనే అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు. ఈ ఆయుధాన్ని వాడుకుని ఓ వర్గంలో భయాన్ని సృష్టించి తద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలనుకుంటున్నారా? అని కాషాయ పార్టీని ప్రశ్నించారు. నటి తునీషా శర్మ, శ్రద్ధా వాకర్‌ హత్యలు లవ్‌ జిహాదీ హత్యలు కాదని తెలిపారు. మహిళలు ఏ వర్గానికి చెందిన వారైనా.. వారిపై దాడులు సరికాదన్నారు. మొత్తంమీద రౌత్ తన పాత మిత్రపక్షం బీజేపీని ఘాటుగా విమర్శిస్తూనే… రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి అవసరమని వివరించారు.

Related News

‘చిన్నారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం’.. ఇన్‌ఫ్లుయెన్సర్ వేధింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఉత్కంఠకు చెక్.. భారత్‌లో చైనా అధ్యక్షుడి పర్యటన ఖరారు.. బ్రిక్స్ సదస్సుకు హాజరు

గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!

సీఎం విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అవును విజయ్.. నా దవడ విరిగింది?

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!

పెళ్లి తర్వాత కూడా మహిళల సమ్మతి ముఖ్యమే.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం!

తెలుగు రాష్ట్రాలకు రైల్వే నిధుల పండుగ.. విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు గుడ్ న్యూస్!

Big Stories

Advertisement
×