E-Paper
Advertisement

Boat Capsize in Madhya Pradesh: మధ్య ప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. పడవ మునిగి ఏడుగురు మృతి

Boat Capsize in Madhya Pradesh: మధ్య ప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. పడవ మునిగి ఏడుగురు మృతి
Advertisement

Seven people Dead as Boat Capsizes in Madhya Pradesh : మధ్యప్రదేశ్ లోని షియోపూర్ లోని విషాధ ఘటన చోటుచేసుకుంది. మాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరోదా గ్రామ సమీపంలోని సీప్ నదిలో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు పడవ నదిలో పడిపోయింది. పడవలో సుమారు 11 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మన్పూర్ ప్రాంతంలో ఈ శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులతో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా నలగురిని సురక్షితంగా రక్షించారు. మృతులలో 35 ఏళ్ల వ్యక్తి, 30 ఏళ్ల మహిళ, 4 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదానికి కారణం తుఫాను లేదా వర్ల్‌పూల్ పడవను కూల్చివేసి ఉండవచ్చని స్థానికులు తెలిపారు.

Advertisement

Also Read: సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇవే..

ప్రమాద వార్త తెలియగానే ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఇక్కడ కూడా పాలనా యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం కనిపించింది. అంబులెన్స్ కూడా సమయానికి సంఘటనా స్థలానికి చేరుకోలేదు. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, సాయంత్రం 6 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని గ్రామస్తులు తెలిపారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×