BigTV English

Boat Capsize in Madhya Pradesh: మధ్య ప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. పడవ మునిగి ఏడుగురు మృతి

Boat Capsize in Madhya Pradesh: మధ్య ప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. పడవ మునిగి ఏడుగురు మృతి

Seven people Dead as Boat Capsizes in Madhya Pradesh : మధ్యప్రదేశ్ లోని షియోపూర్ లోని విషాధ ఘటన చోటుచేసుకుంది. మాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరోదా గ్రామ సమీపంలోని సీప్ నదిలో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు పడవ నదిలో పడిపోయింది. పడవలో సుమారు 11 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మన్పూర్ ప్రాంతంలో ఈ శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.


ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులతో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా నలగురిని సురక్షితంగా రక్షించారు. మృతులలో 35 ఏళ్ల వ్యక్తి, 30 ఏళ్ల మహిళ, 4 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదానికి కారణం తుఫాను లేదా వర్ల్‌పూల్ పడవను కూల్చివేసి ఉండవచ్చని స్థానికులు తెలిపారు.

Also Read: సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇవే..


ప్రమాద వార్త తెలియగానే ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఇక్కడ కూడా పాలనా యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం కనిపించింది. అంబులెన్స్ కూడా సమయానికి సంఘటనా స్థలానికి చేరుకోలేదు. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, సాయంత్రం 6 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని గ్రామస్తులు తెలిపారు.

Related News

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Big Stories

×