BigTV English
Advertisement

Boat Capsize in Madhya Pradesh: మధ్య ప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. పడవ మునిగి ఏడుగురు మృతి

Boat Capsize in Madhya Pradesh: మధ్య ప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. పడవ మునిగి ఏడుగురు మృతి

Seven people Dead as Boat Capsizes in Madhya Pradesh : మధ్యప్రదేశ్ లోని షియోపూర్ లోని విషాధ ఘటన చోటుచేసుకుంది. మాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరోదా గ్రామ సమీపంలోని సీప్ నదిలో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు పడవ నదిలో పడిపోయింది. పడవలో సుమారు 11 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మన్పూర్ ప్రాంతంలో ఈ శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.


ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులతో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా నలగురిని సురక్షితంగా రక్షించారు. మృతులలో 35 ఏళ్ల వ్యక్తి, 30 ఏళ్ల మహిళ, 4 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదానికి కారణం తుఫాను లేదా వర్ల్‌పూల్ పడవను కూల్చివేసి ఉండవచ్చని స్థానికులు తెలిపారు.

Also Read: సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇవే..


ప్రమాద వార్త తెలియగానే ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఇక్కడ కూడా పాలనా యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం కనిపించింది. అంబులెన్స్ కూడా సమయానికి సంఘటనా స్థలానికి చేరుకోలేదు. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, సాయంత్రం 6 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని గ్రామస్తులు తెలిపారు.

Related News

Blood Flow ECMO: మరణించిన తర్వాత కూడా రక్త ప్రసరణ.. ఆసియాలో తొలిసారిగా ఎక్మో టెక్నిక్

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Big Stories

×