BigTV English

Boat Capsize in Madhya Pradesh: మధ్య ప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. పడవ మునిగి ఏడుగురు మృతి

Boat Capsize in Madhya Pradesh: మధ్య ప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. పడవ మునిగి ఏడుగురు మృతి

Seven people Dead as Boat Capsizes in Madhya Pradesh : మధ్యప్రదేశ్ లోని షియోపూర్ లోని విషాధ ఘటన చోటుచేసుకుంది. మాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరోదా గ్రామ సమీపంలోని సీప్ నదిలో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు పడవ నదిలో పడిపోయింది. పడవలో సుమారు 11 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మన్పూర్ ప్రాంతంలో ఈ శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.


ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులతో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా నలగురిని సురక్షితంగా రక్షించారు. మృతులలో 35 ఏళ్ల వ్యక్తి, 30 ఏళ్ల మహిళ, 4 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదానికి కారణం తుఫాను లేదా వర్ల్‌పూల్ పడవను కూల్చివేసి ఉండవచ్చని స్థానికులు తెలిపారు.

Also Read: సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇవే..


ప్రమాద వార్త తెలియగానే ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఇక్కడ కూడా పాలనా యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం కనిపించింది. అంబులెన్స్ కూడా సమయానికి సంఘటనా స్థలానికి చేరుకోలేదు. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, సాయంత్రం 6 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని గ్రామస్తులు తెలిపారు.

Related News

Freebies Cobra Effect: ఉచిత పథకాలు ఎప్పటికైనా నష్టమే.. కోబ్రా ఎఫెక్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

Big Stories

×