E-Paper
Advertisement

కర్ణాటక అధికార కాంగ్రెస్ పార్టీలో మార్పులు.. సీఎం బ్రేక్ ఫాస్ట్ భేటీ, సిద్దరామయ్య నుంచి ఆశీర్వాదం తీసుకున్న డీకే

కర్ణాటక అధికార కాంగ్రెస్ పార్టీలో మార్పులు.. సీఎం బ్రేక్ ఫాస్ట్ భేటీ, సిద్దరామయ్య నుంచి ఆశీర్వాదం తీసుకున్న డీకే
Advertisement

Bengaluru: కర్ణాటక అధికార పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. లీడర్ షిప్ మారుతుందని ఆ పార్టీ నేతలు ఓపెన్‌గా చెప్పలేదు. కాకపోతే జరుగుతున్న పరిణామాలు ఆ దిశగా సాగుతున్నాయి. తాజాగా సీఎం సిద్ధరామయ్య నుంచి డీకే శివకుమార్ ఆశీర్వాదం తీసుకోవడం, ఆ తర్వాత ఆలింగనం చేసుకోవడం వంటి ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో అధికార ప్రభుత్వంలో నాయకత్వం మార్పు ఖాయమైంది.

కర్ణాటక అధికార కాంగ్రెస్ పార్టీలో మార్పులు

Advertisement

కర్ణాటకలో నాయకత్వ మార్పుకు రంగం సిద్ధమైంది. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు సిద్ధరామయ్య. గురువారం ఉదయం సీఎం సిద్ధరామయ్య తన నివాసంలో కేబినెట్ మంత్రులతో బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్ ఏర్పాటు చేశారు. తన నిర్ణయాన్ని కేబినెట్ మంత్రులకు వివరించారు సిద్దరామయ్య.

కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్పాయి. అదే సమయంలో సీఎం సిద్ధరామయ్య నుంచి డీకే శివకుమార్ ఆశీర్వాదం తీసుకోవడం, ఇరువురు నేతలు ఆలింగనం చేసుకోవడం జరిగిపోయింది. వాటికి సంబంధించిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

రాజీనామా చేసిన సీఎం సిద్ధరామయ్య..  సిద్దరామయ్య నుంచి ఆశీర్వాదం తీసుకున్న డీకే

సిద్ధరామయ్య రాజీనామా తర్వాత కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు తీసుకోనున్నారు. గురువారం గవర్నర్‌తో సిద్ధరామయ్య అపాయింట్‌మెంట్ కోరినట్టు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గురువారం మధ్యాహ్నం బెంగుళూరుకు చేరుకుంటారని సమాచారం. ఆ తర్వాత గవర్నర్‌ని కలిసి తన రాజీనామా లేఖను సిద్ధరామయ్య అందజేయనున్నారు.

అదే సమయంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు డీకే శివకుమార్ ఓ లేఖను గవర్నర్‌కు ఇవ్వనున్నారు. డీకే కేబినెట్‌లో ఎవరెవరు ఉంటారు? ఎంతమంది మంత్రులు ఉండనున్నారు? ఇప్పుడున్న మంత్రుల శాఖలు మారే అవకాశం ఉంది. అదే సమయంలో సిద్ధరామయ్య కొడుకు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: బక్రీద్ పండగ వేళ.. మేక ధర రూ. 2.4 లక్షలు, మరొకటి రూ.1.8 లక్షలు, ఎక్కడో తెలుసా?

అదే సమయంలో సిద్ధరామయ్య కర్ణాటక రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటారా? లేకుంటే జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడతారా? అనే దానిపై రకరకాల ఊహాగానాలు లేకపోలేదు. మిగతా రెండేళ్లు ఆయన ఎమ్మెల్యేగా ఉంటారని, రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజ్యసభ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లవచ్చని అంటున్నారు.

రెండురోజుల కిందట కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకేలు ఢిల్లీకి వెళ్లారు. దాదాపు 8 నుంచి 10 గంటలపాటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో ఇరువురు నేతలు చర్చించారు. బుధవారం ఉదయం సీఎం, డిప్యూటీ సీఎంలు బెంగుళూరుకు చేరుకున్నారు.  మరోవైపు గురువారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట సీఎం సిద్ధరామయ్య. కాంగ్రెస్ పెద్దలు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే,  అగ్రనేతలు సోనియా‌గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలవనున్నట్లు తెలుస్తోంది.

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×