Ram Charan Trolling: సినీ పరిశ్రమలో హీరోల జీవితాలు బయటకి కనిపించేంత ఈజీగా ఉండవని సీనియర్ నటుడు జగపతి బాబు స్పష్టం చేశారు. ఇటీవల భోపాల్ ఈవెంట్లో మెగా పవర్ స్టార్ రామ్చరణ్ పొరపాటున కొన్ని మాటలు మార్చి మాట్లాడటంపై జరుగుతున్న ఆన్లైన్ ట్రోలింగ్ను ఆయన తీవ్రంగా ఖండించారు. దర్శకుడు బుచ్చిబాబు సన, రామ్చరణ్ కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమాలో ‘అప్పలసూరి’ అనే కీలక పాత్ర పోషిస్తున్న జగపతి బాబు, ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో చరణ్కు మద్దతుగా నిలిచారు.
Read also-Divi Vadthya: బ్లాక్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్ లో దివి.. రెండు కళ్లు చాలట్లేదు మావా..
సేడిజం చూపిస్తున్నారు!
భోపాల్ ఈవెంట్లో చరణ్ పొరపాటున ‘భోపాల్’ అనబోయి ‘బీహార్’ అని, క్రికెటర్ బుమ్రాను ఫుట్బాల్ ప్లేయర్ అని నోరు జారారు. దీనిపై జగపతి బాబు మాట్లాడుతూ, “ఆ ప్రాంతం వాళ్లో, ఆ వ్యక్తిగత అభిమానులో ఫీల్ అవ్వడంలో తప్పు లేదు. కానీ ఈ మధ్యలో ఉన్న కొందరికి ఏది దొరుకుతుందా, ఎక్కడ నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దామా అనే సేడిజం, పర్వర్షన్ ఎక్కువైపోయింది. అలాంటి వాళ్లే ఇలాంటి చిన్న విషయాలను పట్టుకుని ట్రోల్ చేస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హీరోల నెత్తి మీద లక్ష భారాలు ఉంటాయి
సినిమా షూటింగ్ అయిపోగానే హీరోలు చాలా ఫ్రీగా ఉంటారని అనుకోవడం భ్రమ అని జగ్గుభాయ్ అన్నారు. “ఒక సినిమా పూర్తయ్యాక కూడా హీరోల నెత్తి మీద లక్ష భారాలు (ఒత్తిళ్లు) ఉంటాయి. సెన్సార్ రిపోర్ట్, రీ-రికార్డింగ్ టెన్షన్స్, రిలీజ్ డేట్స్, ప్రొడ్యూసర్ సేఫ్టీ, ఓటీటీ డీల్స్.. ఇలాంటి ఎన్నో సమస్యలు ఒక హీరోని వేధిస్తూ ఉంటాయి. అంత ప్రెషర్లో ఉన్నప్పుడు బై మిస్టేక్ ఒకటి రెండు పొరపాట్లు జరగడం సహజం” అని ఆయన వివరించారు.
‘పెద్ది’ కోసం చరణ్ పడిన కష్టం నాకు తెలుసు
‘పెద్ది’ సినిమా కోసం రామ్చరణ్ శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమించాడని జగపతి బాబు పేర్కొన్నారు. బాడీ లాంగ్వేజ్ మార్చుకుని, భారీ డైలాగులను పర్ఫెక్ట్గా చెప్తూ ఎంతో స్ట్రెయిన్ అయ్యాడని, ఇంత గొప్ప సినిమా చేసాక ఇలాంటి పిచ్చి ట్రోల్స్ గురించి చరణ్ అస్సలు కేర్ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. సెలబ్రిటీల వెనుక ఉండే అసలు ఒత్తిడిని జగ్గుభాయ్ విడమర్చి చెప్పిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.