E-Paper
Advertisement

Singer KS Chithra : రామనామం జపించాలని సందేశం.. గాయని చిత్ర వ్యాఖ్యలపై వివాదం..

Singer KS Chithra : రామనామం జపించాలని సందేశం.. గాయని చిత్ర వ్యాఖ్యలపై వివాదం..
Advertisement

Singer KS Chithra : అయోధ్య ఆలయ మహోత్సవం సందర్భంగా ప్రముఖ గాయని చిత్రపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నెల 22న అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్టాపన జరగనుంది. ఈ సందర్భంగా ప్రజలు రామ నామాన్ని జపించాలని.. సాయంత్రం వేళ 5 ఒత్తుల దీపాన్ని వెలిగించాలని ఆమె దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ప్రతిఒక్కరికి దేవుడి ఆశీస్సులు అందాలని ప్రార్థించిన ఆమె.. లోక సమస్త సుఖినో భవంతు అంటూ సందేశాన్నిచ్చారు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ వీడియోపై కొందరు నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు.

చిత్ర సందేశంపై గాయకుడు సూరజ్ స్పందించారు.లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పే వారి అమాయత్వమే ఇక్కడ గొప్ప విశేషమని.. మసీదును ధ్వంసం చేసి ఆలయాన్ని నిర్మించిన వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా మరిచిపోతున్నారని వ్యంగంగా కామెంట్ చేశారు. అలాగే చిత్ర ఒక రాజకీయ పక్షంవైపు మొగ్గు చూపుతున్నారని మరికొందరు మండిపడుతున్నారు. అయితే మరో గాయకుడు వేణుగోపాల్‌ చిత్రను సమర్థించారు. తన అభిప్రాయాలను వ్యక్తీకరించే హక్కు, స్వేచ్ఛ ఆమెకు ఉన్నాయని.. తన మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు వేణుగోపాల్‌.

Advertisement

గాయని చిత్రను కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ అంశంపై నెట్టింట డైలాగ్ వార్ నడుస్తోంది.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×