Jawans Dead: దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వేసవి తాపానికి తట్టుకోలేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఏడో దశ ఎన్నికల పోలింగ్ ఉత్తరప్రదేశ్లో జరగనుండగా విధుల్లో ఉన్న ఆరుగురు జవాన్లు వడదెబ్బతో మరణించారు.
ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్లో వడదెబ్బతో ఎన్నికల విధుల్లో ఉన్న ఆరుగురు జవాన్లు మరణించారు. అయితే ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో 23 మంది జవాన్లు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని మిర్జాపూర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్బీ లాల్ తెలిపారు. వారిలొ చికిత్స పొందుతూ ఆరుగురు జవాన్లు మరణించినట్లు వెల్లడించారు.
జవాన్లు తీవ్ర జ్వరం, హై షుగర్ లెవల్స్, హైబీపీ లెవల్స్ తో ఆసుపత్రిలో చేరారని ఆర్బీ లాల్ తెలిపారు. ఈ కారణాలతోనే వారు మరణించారని వెల్లడించారు. బీపీ, షుగర్ లెవల్స్ అధికంగా ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందని అన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న జవాన్లు ఆసుపత్రికి తీసుకురాకముందు సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలిపారు.
Also Read: నాగ్పుర్లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత.. సూర్యుడి ప్రతాపానికి జనం విలవిల
గురువారం ఔరంగాబాద్ లో అత్యధికంగా 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వడదెబ్బ కారణంగా సుమారు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. రోగులందరికీ చికిత్స అందించినట్లు స్థానిక ఆసుపత్రి వైద్యుడు అభిషేక్ కుమార్ తెలిపారు. పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది.
#WATCH | Mirzapur, UP: 6 security personnel on election duty die due to excessive heat.
Principal of Medical College RB Lal says, "A total of 23 jawans have come to us… 6 jawans have lost their lives… 2 jawans are in a serious condition. The deceased had a high-grade fever,… pic.twitter.com/S8amDmTPMf
— ANI (@ANI) May 31, 2024