BigTV English

Jawans dead : వడదెబ్బతో ఎన్నికల విధుల్లో ఆరుగురు జవాన్లు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం

Jawans dead : వడదెబ్బతో ఎన్నికల విధుల్లో ఆరుగురు జవాన్లు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం

Jawans Dead: దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వేసవి తాపానికి తట్టుకోలేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఏడో దశ ఎన్నికల పోలింగ్ ఉత్తరప్రదేశ్‌లో జరగనుండగా విధుల్లో ఉన్న ఆరుగురు జవాన్లు వడదెబ్బతో మరణించారు.


ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో వడదెబ్బతో ఎన్నికల విధుల్లో ఉన్న ఆరుగురు జవాన్లు మరణించారు. అయితే ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో 23 మంది జవాన్లు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని మిర్జాపూర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్బీ లాల్ తెలిపారు. వారిలొ చికిత్స పొందుతూ ఆరుగురు జవాన్లు  మరణించినట్లు వెల్లడించారు.

జవాన్లు తీవ్ర జ్వరం, హై షుగర్ లెవల్స్, హైబీపీ లెవల్స్ తో ఆసుపత్రిలో చేరారని ఆర్బీ లాల్ తెలిపారు. ఈ కారణాలతోనే వారు మరణించారని వెల్లడించారు. బీపీ, షుగర్ లెవల్స్ అధికంగా ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందని అన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న జవాన్లు ఆసుపత్రికి తీసుకురాకముందు సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలిపారు.


Also Read:  నాగ్‌పుర్‌లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత.. సూర్యుడి ప్రతాపానికి జనం విలవిల

గురువారం ఔరంగాబాద్ లో అత్యధికంగా 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వడదెబ్బ కారణంగా సుమారు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. రోగులందరికీ చికిత్స అందించినట్లు స్థానిక ఆసుపత్రి వైద్యుడు అభిషేక్ కుమార్ తెలిపారు. పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది.

 

Related News

UP News: విద్యా అధికారిపై కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Big Stories

×