BigTV English

Jawans dead : వడదెబ్బతో ఎన్నికల విధుల్లో ఆరుగురు జవాన్లు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం

Jawans dead : వడదెబ్బతో ఎన్నికల విధుల్లో ఆరుగురు జవాన్లు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం

Jawans Dead: దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వేసవి తాపానికి తట్టుకోలేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఏడో దశ ఎన్నికల పోలింగ్ ఉత్తరప్రదేశ్‌లో జరగనుండగా విధుల్లో ఉన్న ఆరుగురు జవాన్లు వడదెబ్బతో మరణించారు.


ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో వడదెబ్బతో ఎన్నికల విధుల్లో ఉన్న ఆరుగురు జవాన్లు మరణించారు. అయితే ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో 23 మంది జవాన్లు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని మిర్జాపూర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్బీ లాల్ తెలిపారు. వారిలొ చికిత్స పొందుతూ ఆరుగురు జవాన్లు  మరణించినట్లు వెల్లడించారు.

జవాన్లు తీవ్ర జ్వరం, హై షుగర్ లెవల్స్, హైబీపీ లెవల్స్ తో ఆసుపత్రిలో చేరారని ఆర్బీ లాల్ తెలిపారు. ఈ కారణాలతోనే వారు మరణించారని వెల్లడించారు. బీపీ, షుగర్ లెవల్స్ అధికంగా ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందని అన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న జవాన్లు ఆసుపత్రికి తీసుకురాకముందు సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలిపారు.


Also Read:  నాగ్‌పుర్‌లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత.. సూర్యుడి ప్రతాపానికి జనం విలవిల

గురువారం ఔరంగాబాద్ లో అత్యధికంగా 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వడదెబ్బ కారణంగా సుమారు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. రోగులందరికీ చికిత్స అందించినట్లు స్థానిక ఆసుపత్రి వైద్యుడు అభిషేక్ కుమార్ తెలిపారు. పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది.

 

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×