E-Paper
Advertisement

Mallikarjun Kharge: కూటమి అధికారంలోకి వస్తే.. ప్రధాని ఎవరవుతారంటే..?

Mallikarjun Kharge: కూటమి అధికారంలోకి వస్తే.. ప్రధాని ఎవరవుతారంటే..?
Advertisement

Rahul Gandhi is My Choice for PM, Says Kharge: దేశంలో పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతున్నాయి. నిన్నటితో పార్లమెంటు ఎన్నికల ప్రచారం దేశవ్యాప్తంగా ముగిసిన విషయం తెలిసిందే. రేపు చివరి దశ- ఏదో దశ ఎన్నికల పోలింగ్ జరగనున్నది. జూన్ 4న పార్లమెంటు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. ‘మాకు ఎక్కువ సీట్లు వస్తాయి.. మేమే అధికారంలోకి రాబోతున్నాం’ అంటూ ఇటు బీజేపీ అటు కూటమి ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు అంశాలపై కూడా దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. అదేమంటే.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరు ప్రధాని అవుతారు.? ఇటు కూటమి అధికారంలోకి వస్తే ఎవరు ప్రధాని అవుతారు? అంటూ ప్రజల్లో చర్చ కొనసాగుతుంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రధాని అభ్యర్థిగా తాను రాహుల్ నే సమర్థిస్తానంటూ ఆయన పేర్కొన్నారు. ఓ జాతీయా మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ విధంగా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా రాయ్ బరేలీ స్థానం విషయమై కూడా మాట్లాడారు. ఈ స్థానాన్ని ప్రియాంక గాంధీకే కేటాయించాలంటూ తాను ప్రతిపాదించినట్లు ఆయన చెప్పారు. అయితే, అక్కడి నుంచి రాహుల్ గాంధీయే పోటీ చేస్తానని ముందుకు రావడంతో ప్రియాంక తప్పుకున్నారంటూ ఆయన తెలిపారు.

Advertisement

Also Read: రేపే తుది దశ పోలింగ్.. ఈసారి ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారంటే.. ?

ఖర్గే వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అని, కూటమిలో కీలక పాత్రను పోషిస్తున్న కాంగ్రెస్ కే ప్రధానమంత్రి పదవి దక్కే అవకాశముందంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Related News

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

Big Stories

Advertisement
×