E-Paper
Advertisement

Heat waves: నాగ్‌పుర్‌లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత.. సూర్యుడి ప్రతాపానికి జనం విలవిల

Heat waves: నాగ్‌పుర్‌లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత.. సూర్యుడి ప్రతాపానికి జనం విలవిల

Nagpur Heatwave Hits 56C : దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఎండల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఢిల్లిలో ఇటీవల 52 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దాన్ని దాటి మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఏకంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

నాగ్‌పుర్‌లో భారత వాతావరణ విభాగం నాలుగు ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లను ఏర్పాటు చేయగా..అందులోని రెండింటిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోనేగావ్ లోని ఏడబ్ల్యూ స్టేషన్‌లో 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతే కాకుండా ఉత్తర అంబాజరీ రోడ్డులోని ఐఎండీ కేంద్రంలో రికార్డు స్థాయిలో 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా..మిగతా రెండు స్టేషన్లలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

ఇటీవల ఢిల్లీలోని ముంగేష్‌పూర్ లో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ఢిల్లీ చరిత్రలోనే ఇదే అత్యధికం. ఆ సమయంలో సెన్సార్ సరిగా పనిచేస్తుందో లేదో అని తనిఖి చేస్తున్నట్లు ఐఎండీ తెలిపింది. కానీ ప్రస్తుతం నాగ్‌పుర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తీవ్రమైన ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

Also Read: ఢిల్లీలో నీటి సంక్షోభం, చేతులు జోడించి సీఎం అభ్యర్థన, ఆపై కోర్టుకు

దేశ వ్యాప్తంగా ఎండల కారణంగా 54 మంది మృతి చెందారు. అత్యధికంగా బీహార్ లో 32 మంది మృతి చెందగా..ఒడిశాలో 10, జార్ఖండ్‌లో5, రాజస్థాన్‌లో 5, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు, ఢిల్లీలో ఒకరు మరణించారు. వచ్చే రెండు రోజుల్లో ఢిల్లీ, చండీఘర్, హర్యానాతో పాటు పలు ప్రాంతాల్లో దుమ్ము తుఫాను వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగాలులు ఎక్కువగా ఉండటం వల్ల దేశంలో జాతీయ ఎమర్జెన్సీని విధించే అవకాశాలను పరిశీలించాలని రాజస్థాన్ హైకోర్టు కేంద్రానికి సూచించింది.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×