E-Paper
Advertisement

Sonia Gandhi to Modi: పార్లమెంట్ స్పెషల్ సెషన్.. ఎజెండా ఏంటి? మోదీకి సోనియా లెటర్..

Sonia Gandhi to Modi: పార్లమెంట్ స్పెషల్ సెషన్.. ఎజెండా ఏంటి? మోదీకి సోనియా లెటర్..
Sonia Gandhi to Modi

Sonia Gandhi latest news(Politics news today India) :

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏంటో చెప్పాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల ఎజెండాలో 9 అంశాలను చేర్చాలని కోరారు.

విపక్ష పార్టీలను సంప్రదించకుండానే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల షెడ్యూల్ ను కేంద్రం ప్రకటించింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. కానీ ఎందుకోసం ఈ సమావేశాలు నిర్వహించనున్నారనే క్లారిటీ మాత్రం లేదు. ఈ నేపథ్యంలోనే వచ్చే సమావేశాల్లో కొన్ని అంశాలను చర్చకు తీసుకురావాలని సోనియా గాంధీ లేఖలో కోరారు.

అదానీ అక్రమాలు, మణిపూర్‌ అల్లర్లు, కులాల వారీగా జనగణన, రైతు సమస్యలు, కనీస మద్దతు ధర విషయంలో ఇచ్చిన హామీపై పార్లమెంట్ లో చర్చ చేపట్టాలని సోనియా కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దిగజారుతున్న సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను ఆదుకోవడం, హర్యానాతోపాటు అనేక రాష్ట్రాల్లో చెలరేగుతున్న మత ఘర్షణలు, సరిహద్దుల్లో కొనసాగుతున్న చైనా ఆక్రమణలపై పార్లమెంట్ స్పెషన్ సెషన్ లో చర్చించాలని లేఖలో పేర్కొన్నారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్షాల కూటమి నేతలు ఇప్పటికే చర్చించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్‌, డీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఆప్‌, టీఎంసీ, జేఎంఎం పార్టీల నేతలు పాల్గొన్నారు. మోదీ చాలీసా కోసమయితే తాము పార్లమెంట్ కు వెళ్లమన్నారు. కానీ సమావేశాల్లో ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు.

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జమిలి ఎన్నికల కోసం బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి అమలు, ఓబీసీ వర్గీకరణ లాంటి అంశాలపై చర్చించడానికే ఏర్పాటు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ రాయడం ఆసక్తిగా మారింది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×