E-Paper
Advertisement

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో 10 మంది భారతీయుల మృతి.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం!

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో 10 మంది భారతీయుల మృతి.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం!
Advertisement

Indians died in Russia Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న భారతీయుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు నివేదిక స‌మ‌ర్పించింది. ఉద్యోగాల వేటలో రష్యాకు వెళ్లి, అక్కడ యుద్ధరంగంలోకి దిగాల్సి వచ్చిన వారిలో ఇప్పటివరకు 10 మంది భారతీయులు మరణించారని కేంద్రం ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. మరణించిన వారంతా స్వచ్ఛంద ఒప్పందాల ప్రాతిపదికనే రష్యన్ దళాలలో చేరి యుద్ధం చేశారని ప్రభుత్వం పేర్కొంది.

ప్ర‌ధాన‌ న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విపుల్ పంచోలి, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఉపాధి కోసం రష్యాకు వెళ్లిన తమ వారిని ఏజెంట్లు మోసం చేసి, బలవంతంగా యుద్ధంలోకి దించారని ఆరోపిస్తూ 26 మంది భారతీయుల కుటుంబ సభ్యులు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కోర్టు విచారించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ.. పిటిషన్‌లో పేర్కొన్న 26 మందిలో పది మంది దురదృష్టవశాత్తు మరణించారని ధృవీకరించారు.

Advertisement

విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, పిటిషనర్ల తరఫు న్యాయవాదుల మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. బాధితుల కుటుంబాలతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఏమాత్రం సంప్రదింపులు జరపడం లేదని పిటిషనర్ల న్యాయవాది ఆరోపించారు. దీనికి ASG స్పందిస్తూ.. రష్యాకు వెళ్లిన 215 మంది భారతీయులలో 26 మంది కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయని, వారితో తాము నిరంతరం టచ్‌లోనే ఉన్నామని తెలిపారు. మరణించిన వారి భౌతిక కాయాలను వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, కొన్ని కుటుంబాల నుండి సహకారం లభించడం లేదని ఆమె కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

యుద్ధ ప్రాంతాల నుండి భౌతిక కాయాలను గుర్తించి తీసుకురావడం అనేది దాదాపు అసాధ్యమైన, అత్యంత సున్నితమైన విషయమని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారాన్ని అత్యంత చాకచక్యంగా (Tactful handling) పరిష్కరించాలని సూచించారు. బాధితుల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. మంత్రిత్వ శాఖ కంటే బయటి వ్యక్తులే తమకు ఎక్కువ సమాచారం ఇస్తున్నారని, కనీసం డీఎన్ఏ (DNA) నమూనాల సేకరణకైనా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

Advertisement

ఏజెంట్లు భారతీయులను తప్పుదోవ పట్టించి ఉండవచ్చని కేంద్రం అంగీకరించింది. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, భౌతిక కాయాల తరలింపులో ఉన్న సాధకబాధకాలను వివరిస్తూ సమగ్రమైన స్టేటస్ రిపోర్ట్‌ను దాఖలు చేయాలని సుప్రీంకోర్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించింది.

Read Also: దేశంలో ప్రభుత్వ బస్సులు లేని రాష్ట్రాలు ఇవే.. అంతా ప్రైవేట్ చేతుల్లోనే ప్రజారవాణా..!

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×