BigTV English

National:‘నీట్’ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..నేడు సుప్రీంకోర్టు లో విచారణ

National:‘నీట్’ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..నేడు సుప్రీంకోర్టు లో విచారణ

Supreme Court to hear 38 petitions related to controversy ridden NEET UG 2024  Today
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్’ అర్హత పరీక్ష పేపర్ లీకేజ్ కేసు పై దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 8న సుప్రీం కోర్టు లో విచారణ జరగనుంది. వంద శాతం మార్కులు వచ్చిన వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో నీట్ నిర్వహణపై అనుమానాలు రేకెత్తాయి. పోలీసుల విచారణలో గుజరాత్, బీహార్ రాష్ట్రాలలో లీక్ కుట్ర ఛేదించారు. తర్వాత ‘నీట్’ పరీక్ష రద్దు చేయాలని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయి.రద్దు చేస్తే కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని కేంద్రం తరపున కొందరు పరీక్షరద్దు చేయొద్దని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రద్దు చేయాలని కోరుతో మరికొందరు సుప్రీం ను ఆశ్రయించారు. ఇదే అంశంపై దాదాపు 38 పిటిషన్లు దాఖలవడం గమనార్హం. ‘నీట్ ’ కేసును చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో మనోజ్ మిశ్రా, జేపీ పార్థీవాలాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.


రద్దు చేయొద్దంటూ అభ్యర్థన

నీట్ రద్దు చేయొద్దంటూ కేంద్రం ఇప్పటికే సుప్రీం కోర్టుకు సూచించింది. అందరూ అనుకున్నట్లుగా అక్కడ అవకతవకలు ఏమీ జరగలేదని సుప్రీంకు తెలిపింది. పైగా సిన్సియర్ గా పరీక్ష రాసిన విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపింది.నీట్ రద్దు చేస్తే లక్షలాది విద్యార్థుల జీవితాలు ఆగం అవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. లక్షలాది విద్యార్థుల ప్రయోజనానికి తాము కట్టుబడి ఉన్నామని సుప్రీంకు కేంద్రం తెలిపింది.


కౌన్సెలింగ్ వాయిదా

నీట్ యూజీ కౌన్సెలింగ్ కూడా పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే. సోమవారం కోర్టు తీర్పు నేపథ్యంలోనే వాయిదా వేయడం జరిగిందని మెడికల్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కౌన్సెలింగ్ వాయిదా వేయడానికి సుప్రీం ససేమిరా ఒప్పుకోలేదు. అయినా కేంద్రం వాయిదా వెయ్యడానికే నిర్ణయిచుకుంది. ఏది ఏమైనా సుప్రీం తీర్పు తర్వాతే కౌన్సెలింగ్ పై మెడికల్ బోర్డు నిర్ణయం తీసకుంటుంది.

తీర్పుపై ఉత్కంఠ

సీయూఈటీ యూజీ ఎక్గామ్ ఆన్సర్ కీని రిలీజ్ చేసింది. త్వరలోనే వీటి ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో అని అందరూ ఉత్కంఠగా ఉన్నారు. మంచిగా కష్టపడి చదివి ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులు తమ పరిస్థితి ఏమిటో అని ఆందోళన పడుతున్నారు.

Related News

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Big Stories

×