Tamil Nadu election Results Live Updates: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు అధికారులు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. అందులో అధికార డీఎంకె పార్టీ దూసుకుపోతోంది.
అందులో 50 డీఎంకెకు రాగా, కేవలం 25 మాత్రం అన్నాడీఎంకెకు వచ్చాయి. విజయ్ టీవీకె పార్టీ ఈ రేసులో కొనసాగుతోంది. పెరంబూరులో టీవీకె చీఫ్ విజయ్ ఆధిక్యంలో ఉన్నారు. చేపాక్కం-తిరువల్లికేణిలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ లీడ్లో ఉన్నారు. తన కంచుకోట ఎడప్పాడిలో పళనిస్వామి కాస్త వెనుకబడ్డారు.
తొలిసారి తమిళనాడులో త్రిముఖ పోటీ నెలకొంది. దాదాపు ఐదు దశాబ్దాలకుపైగా ద్రవిడ రాజకీయాలకు కంచుకోటగా మారింది. అధికార డీఎంకే- ఏఐఏడీఎంకేల మధ్య ఈసారి మార్పు గాలి వీచే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ సర్వే ద్వారా తేలింది. అధికార డీఎంకే, ఏఐఏడీఎంకే, తమిళగ వెట్రి కజగం (టీవీకే)లతో త్రిముఖ పోటీ నెలకొంది.
చాలా ఎగ్జిట్ పోల్స్ డీఎంకే వరుసగా రెండోసారి గెలుస్తుందని అంచనా వేశాయి. ఈసారి రాష్ట్రంలో విజయ్ ప్రభావం ఉంటుందని యాక్సిస్ మై ఇండియా సంస్థ సూచించింది. మెజారిటీ మార్క్ 118గా ఉన్న రాష్ట్రంలోని 234 సీట్లలో సుమారు 100 సీట్లు టీవీకే పార్టీ గెలిచి కింగ్ మేకర్గా మారవచ్చని తేల్చింది.