E-Paper
Advertisement

Terrorists: ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

Terrorists: ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Advertisement

Terrorists: ఉగ్రవాదులపై కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. యాక్టివ్‌గా ఉన్న ఉగ్రవాదులను జైలుకు తరలిస్తామని అన్నారు. లేకుంటే నేరుగా నరకానికే పంపిస్తామని హెచ్చరించారు. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో మాట్లాడుతూ జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదుల అంశాన్ని కూడా ప్రస్తావించారు. జమ్ము కశ్మీర్‌లో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాదులను జైలుకు పంపుతాం అని అన్నారు. లేకుంటే నరకానికే పంపిస్తాం అని హెచ్చరించారు ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వం ఏ మాత్రం సహించదని స్పష్టం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలను అంతం చేస్తామని తెలిపారు. అంతే కాకుండా జమ్ము కశ్మీర్‌లో గత కొద్ది రోజుల్లోనే 28 మంది ఉగ్రవాదులు హతమైనట్లు వెల్లడించారు.

Advertisement

అదే విధంగా జమ్మూ కశ్మీర్‌లో గత కొద్దిరోజుల్లోనే 28 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు. ఈ దాడుల్లో కొందరు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారని మంత్రి వివరించారు. 2019లో ఆర్టికల్ 370 ని రద్దు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు హిల్ స్టేట్ లో భద్రతా బలగాలు దాదాపు 900 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు వెల్లడించారు. ఉగ్రదాడులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కూడా మంత్రి ఈ సందర్భంగా మండిపడ్డారు. 2004-2014 లో యూపీఏ ప్రభుత్వ హయాంలో జమ్మూకాశ్మీర్‌లో 7217 ఉగ్రవాదులు ఘటనలు జరిగాయని మంత్రి తెలిపారు ఆ దాడుల్లో 2,829 మంది పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు, అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య 67 శాతానికి తగ్గిందని అన్నారు.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×