E-Paper
Advertisement

Terrorists: ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

Terrorists: ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Advertisement

Terrorists: ఉగ్రవాదులపై కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. యాక్టివ్‌గా ఉన్న ఉగ్రవాదులను జైలుకు తరలిస్తామని అన్నారు. లేకుంటే నేరుగా నరకానికే పంపిస్తామని హెచ్చరించారు. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో మాట్లాడుతూ జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదుల అంశాన్ని కూడా ప్రస్తావించారు. జమ్ము కశ్మీర్‌లో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాదులను జైలుకు పంపుతాం అని అన్నారు. లేకుంటే నరకానికే పంపిస్తాం అని హెచ్చరించారు ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వం ఏ మాత్రం సహించదని స్పష్టం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలను అంతం చేస్తామని తెలిపారు. అంతే కాకుండా జమ్ము కశ్మీర్‌లో గత కొద్ది రోజుల్లోనే 28 మంది ఉగ్రవాదులు హతమైనట్లు వెల్లడించారు.

Advertisement

అదే విధంగా జమ్మూ కశ్మీర్‌లో గత కొద్దిరోజుల్లోనే 28 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు. ఈ దాడుల్లో కొందరు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారని మంత్రి వివరించారు. 2019లో ఆర్టికల్ 370 ని రద్దు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు హిల్ స్టేట్ లో భద్రతా బలగాలు దాదాపు 900 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు వెల్లడించారు. ఉగ్రదాడులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కూడా మంత్రి ఈ సందర్భంగా మండిపడ్డారు. 2004-2014 లో యూపీఏ ప్రభుత్వ హయాంలో జమ్మూకాశ్మీర్‌లో 7217 ఉగ్రవాదులు ఘటనలు జరిగాయని మంత్రి తెలిపారు ఆ దాడుల్లో 2,829 మంది పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు, అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య 67 శాతానికి తగ్గిందని అన్నారు.

Related News

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

Big Stories

Advertisement
×