E-Paper
Advertisement

Wrestlers : బ్రిజ్‌ భూషణ్ అరెస్టుకు రెజ్లర్ల పట్టు.. చర్చలకు కేంద్రం మరోసారి ఆహ్వానం..

Wrestlers : బ్రిజ్‌ భూషణ్ అరెస్టుకు రెజ్లర్ల పట్టు.. చర్చలకు కేంద్రం మరోసారి ఆహ్వానం..
Advertisement

Wrestlers : బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ పోరాటం చేస్తున్న రెజ్లర్లను మరోసారి కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. ఇటీవల అమిత్ షా వారితో మాట్లాడారు. ఆ తర్వాత నుంచి కీలక పరిణామాలు జరిగాయి. స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌ రైల్వేలో తిరిగి విధుల్లో చేరారు. అమిత్ షాతో భేటీ జరిగిన రెండు రోజులకే రెజ్లర్లు విధులు చేరడంతో ఉద్యమం ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి.

Advertisement

ఈ ఇష్యూపై స్పందించిన సాక్షిక్ మాలిక్ పోరాటం ఆపేదని లేదని స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం విధుల్లో చేరినా ఆందోళన కొనసాగుతుందని తేల్చిచెప్పారు. అమిత్ షాతో భేటీపై బజరంగ్ పునియా మాట్లాడారు. కేంద్రమంత్రితో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదన్నారు. ఈ ఉద్యమం ఆగదని ప్రకటించారు. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై వ్యూహరచన చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ స్పందనతో తాము సంతృప్తిగా లేమని పునియా తేల్చిచెప్పారు.

బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్ రంగంలోకి దిగారు. వారితో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ట్వీట్ చేశారు.

Advertisement

కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్ విజ్ఞప్తిపై రెజ్లర్లు స్పందించారు. తమ పోరాటాన్ని ఆపేది లేదన్నారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్‌ చేయాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. కేంద్రం విజ్ఞప్తిపై కాప్‌ పంచాయత్‌లో చర్చిస్తామన్నారు. రూమ్‌ల్లో కాదు.. బహిరంగంగా చర్చించాలని రెజ్లర్ల కోరుతున్నారు.

Related News

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

Advertisement
×