E-Paper
Advertisement

Wrestlers : బ్రిజ్‌ భూషణ్ అరెస్టుకు రెజ్లర్ల పట్టు.. చర్చలకు కేంద్రం మరోసారి ఆహ్వానం..

Wrestlers : బ్రిజ్‌ భూషణ్ అరెస్టుకు రెజ్లర్ల పట్టు.. చర్చలకు కేంద్రం మరోసారి ఆహ్వానం..

Wrestlers : బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ పోరాటం చేస్తున్న రెజ్లర్లను మరోసారి కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. ఇటీవల అమిత్ షా వారితో మాట్లాడారు. ఆ తర్వాత నుంచి కీలక పరిణామాలు జరిగాయి. స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌ రైల్వేలో తిరిగి విధుల్లో చేరారు. అమిత్ షాతో భేటీ జరిగిన రెండు రోజులకే రెజ్లర్లు విధులు చేరడంతో ఉద్యమం ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి.

ఈ ఇష్యూపై స్పందించిన సాక్షిక్ మాలిక్ పోరాటం ఆపేదని లేదని స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం విధుల్లో చేరినా ఆందోళన కొనసాగుతుందని తేల్చిచెప్పారు. అమిత్ షాతో భేటీపై బజరంగ్ పునియా మాట్లాడారు. కేంద్రమంత్రితో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదన్నారు. ఈ ఉద్యమం ఆగదని ప్రకటించారు. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై వ్యూహరచన చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ స్పందనతో తాము సంతృప్తిగా లేమని పునియా తేల్చిచెప్పారు.

బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్ రంగంలోకి దిగారు. వారితో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ట్వీట్ చేశారు.

కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్ విజ్ఞప్తిపై రెజ్లర్లు స్పందించారు. తమ పోరాటాన్ని ఆపేది లేదన్నారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్‌ చేయాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. కేంద్రం విజ్ఞప్తిపై కాప్‌ పంచాయత్‌లో చర్చిస్తామన్నారు. రూమ్‌ల్లో కాదు.. బహిరంగంగా చర్చించాలని రెజ్లర్ల కోరుతున్నారు.

Related News

Bengal Clashes: బెంగాల్ దారుణాలు.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

Big Stories

×