Big Stories

Shocking Video: కచోరి షాపులోకి దూసుకొచ్చిన బెంజ్ కారు.. ఆరుగురికి తీవ్ర గాయాలు

- Advertisement -

Shocking Video: ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ కచోరి సమోసా వాలా షాపులోకి బెంజ్ కారు అమాంతం దూసుకొచ్చింది. ఈ ఘటన ఢిల్లీలోని కాశ్మీరి గేట్ ఏరియాలో గల ఫటేహ్ కచోరి షాపులో వెలుగుచూసింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన విష్యూవల్స్ అక్కడి సీసీటీవీ కామెరాలో రికార్డ్ అయ్యాయి. ఎప్పటి లాగే కచోరి షాపులోని సిబ్బంది తమ పనులు చేసుకుంటున్నారు. షాపుకు వచ్చిన కస్టమర్లకు కచోరీలు, సమోసాలు, టీలు అందిస్తూ యధావిథిగా బిజినెస్ నడిపిస్తున్నారు. ఈ తరుణంలోనే ఓ ఎస్‌యూవీ కారు షాపులోకి దూసుకొచ్చింది. దీంతో ప్రశాంత వాతావరణంలో హ్యాపీగా కచోరీలు తింటున్న కస్టమర్లు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. షాపు ముందు ఉన్న నిలబడి తింటున్న వ్యక్తులు, టేబుల్స్‌తో సహా తోసుకుంటూ షాపులోకి ఆ కారు దూసుకెళ్లింది. కారు తమ మీదకు దూసుకురావడాన్ని గమనించిన కొంతమంది అక్కడి నుండి పరుగులు తీసి జాగ్రత్త పడ్డారు. కారు దూసుకువచ్చి గోడకు ఢీ కొట్టింది. దీంతో పలువురు తమ కుటుంబ సభ్యులు కారు కింద పడిపోయారనే ఆందోళనతో ఓ వ్యక్తి తన భార్య కోసం వెతుకులాట ప్రారంభించాడు. ఈ తరుణంలో కారు ఆమెను షాపులోకి తోసుకెళ్లింది కాబట్టి నెమ్మదిగా అందులో నుంచి బయటకు వచ్చింది. దీంతో ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకున్నాడు.

Also Read: హే ప్రభూ.. బార్బీలా మారాలనుకుని.. చివరికి జాంబీలా తయారైందేంటి

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు నడిపిన వ్యక్తి నోయిడాకు చెందిన 36 ఏళ్ల పరాగ్ అనే లాయర్‌గా గుర్తించారు. పరాగ్‌తో పాటు ఆయన భార్య కూడా ఆ కారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం వారు పారిపోలేదని.. పోలీసులు వెళ్లే సరికి అక్కడే ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం డ్రైవర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఎస్ యూవీ కారును సీజ్ చేశారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక పోలీసుల విచారణలో భాగంగా పరాగ్‌కు నిర్వహించిన మెడికల్ టెస్టుల్లో తాను తాగలేదని పోలీసులు నిర్ధారించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News