E-Paper
Advertisement

Shocking Video: కచోరి షాపులోకి దూసుకొచ్చిన బెంజ్ కారు.. ఆరుగురికి తీవ్ర గాయాలు

Shocking Video: కచోరి షాపులోకి దూసుకొచ్చిన బెంజ్ కారు.. ఆరుగురికి తీవ్ర గాయాలు
Advertisement

Shocking Video: ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ కచోరి సమోసా వాలా షాపులోకి బెంజ్ కారు అమాంతం దూసుకొచ్చింది. ఈ ఘటన ఢిల్లీలోని కాశ్మీరి గేట్ ఏరియాలో గల ఫటేహ్ కచోరి షాపులో వెలుగుచూసింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Advertisement

ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన విష్యూవల్స్ అక్కడి సీసీటీవీ కామెరాలో రికార్డ్ అయ్యాయి. ఎప్పటి లాగే కచోరి షాపులోని సిబ్బంది తమ పనులు చేసుకుంటున్నారు. షాపుకు వచ్చిన కస్టమర్లకు కచోరీలు, సమోసాలు, టీలు అందిస్తూ యధావిథిగా బిజినెస్ నడిపిస్తున్నారు. ఈ తరుణంలోనే ఓ ఎస్‌యూవీ కారు షాపులోకి దూసుకొచ్చింది. దీంతో ప్రశాంత వాతావరణంలో హ్యాపీగా కచోరీలు తింటున్న కస్టమర్లు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. షాపు ముందు ఉన్న నిలబడి తింటున్న వ్యక్తులు, టేబుల్స్‌తో సహా తోసుకుంటూ షాపులోకి ఆ కారు దూసుకెళ్లింది. కారు తమ మీదకు దూసుకురావడాన్ని గమనించిన కొంతమంది అక్కడి నుండి పరుగులు తీసి జాగ్రత్త పడ్డారు. కారు దూసుకువచ్చి గోడకు ఢీ కొట్టింది. దీంతో పలువురు తమ కుటుంబ సభ్యులు కారు కింద పడిపోయారనే ఆందోళనతో ఓ వ్యక్తి తన భార్య కోసం వెతుకులాట ప్రారంభించాడు. ఈ తరుణంలో కారు ఆమెను షాపులోకి తోసుకెళ్లింది కాబట్టి నెమ్మదిగా అందులో నుంచి బయటకు వచ్చింది. దీంతో ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకున్నాడు.

Also Read: హే ప్రభూ.. బార్బీలా మారాలనుకుని.. చివరికి జాంబీలా తయారైందేంటి

Advertisement

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు నడిపిన వ్యక్తి నోయిడాకు చెందిన 36 ఏళ్ల పరాగ్ అనే లాయర్‌గా గుర్తించారు. పరాగ్‌తో పాటు ఆయన భార్య కూడా ఆ కారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం వారు పారిపోలేదని.. పోలీసులు వెళ్లే సరికి అక్కడే ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం డ్రైవర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఎస్ యూవీ కారును సీజ్ చేశారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక పోలీసుల విచారణలో భాగంగా పరాగ్‌కు నిర్వహించిన మెడికల్ టెస్టుల్లో తాను తాగలేదని పోలీసులు నిర్ధారించారు.

Tags

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×