E-Paper
Advertisement

Kangana Ranaut: అలా మాట్లాడినందుకే కంగనాను కానిస్టేబుల్ కొట్టింది: పంజాబ్ సీఎం

Kangana Ranaut: అలా మాట్లాడినందుకే కంగనాను కానిస్టేబుల్ కొట్టింది: పంజాబ్ సీఎం
Advertisement

Punjab CM Bhagwant Mann on Kangana issue: ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన బాలీవుడ్ సీనియర్ నటి కంగనా రనౌత్‌ను సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టిన ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. పంజాబ్ రైతుల పోరాటంపై కంగనా చేసిన వ్యాఖ్యల కారణంగానే ఆమెను కానిస్టేబుల్ కొట్టిందంటూ ఆయన పేర్కొన్నారు.

అది కోపమే.. కానీ, గతంలో కంగనా మాట్లాడిన మాటలే ఆ కానిస్టేబుల్‌ను ఆగ్రహానికి గురి చేశాయి. అయితే, ఇది జరగకుండా ఉండాల్సింది. ఆమె అలా మాట్లాడడం తప్పు అంటూ భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అయితే.. ఈ ఘటన జరిగిన తర్వాత నటి కంగనా చేసిన వ్యాఖ్యల పట్ల పంజాబ్ సీఎం అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్ రాష్ట్రంలో తీవ్రవాదమంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.

Advertisement

దేశ స్వాతంత్ర్య పోరాటంలో పంజాబ్ ప్రజలు చేసిన పోరాటాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే నేడు పంజాబ్.. దేశానికి ఆహారాన్ని అందజేస్తుందని తెలిపారు. రాష్ట్రంపై ప్రతీ విషయంలో తీవ్రవాదులు, వేర్పాటు వాదులంటూ విమర్శించడం సరికాదన్నారు. పంజాబ్ రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేసిన సమయంలో తీవ్రవాదులంటూ ఆరోపించారని వాపోయారు.

Also Read: మణిపూర్ హింసపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు.. 

Advertisement

కాగా, జూన్ 6న కంగనా రనౌత్ చండీగఢ్ ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ చెక్‌కు వెళ్లిన క్రమంలో అక్కడున్న కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెను చెంప దెబ్బ కొట్టింది. రైతుల పోరాటంలో తన తల్లి పాల్గొన్నదని, ఆ పోరాటాన్ని కంగనా రనౌత్ కించపరిచినందుకే తాను కొట్టినట్లు ఆమె పేర్కొన్న విషయం తెలిసిందే.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×