BigTV English
Advertisement

Richest State in India : ఇండియాలో రిచెస్ట్ స్టేట్ జాబితా విడుదల.. టాప్‌లో ఉన్న రాష్ట్రం ఇదే..!

Richest State in India : ఇండియాలో రిచెస్ట్ స్టేట్ జాబితా విడుదల.. టాప్‌లో ఉన్న రాష్ట్రం ఇదే..!

Top 10 Richest Indian states in 2024: ఇండియాలో రిచెస్ట్ స్టేట్ జాబితా విడుదలైంది. దేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రంగా మహారాష్ట్ర అవతరించింది. 42.67 లక్షల కోట్ల రూపాయల జిడిఎస్‌పి (GDSP) అంచనా ప్రకారం మహారాష్ట్ర తలసరి స్థూల దేశీయోత్పత్తిలో 13.30 పర్సెంట్ వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. అయితే జిడిపి(GDP) తలసరి ఆదాయంలో మాత్రం తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణలో తలసరి ఆదాయం 3.83 లక్షల రూపాయలుగా ఉంది. ఇది దేశంలోనే అత్యధికం కావడం విశేషం.


ఇక తలసరి ఆదాయం(GDP) పరంగా చూస్తే.. తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. అటు జిడిపి లో కూడా 31.55 లక్షల కోట్లతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచి జాతీయ జిడిపిలో 8.90 వాటాను దక్కించుకుంది. ఇక మూడో స్థానంలో కర్ణాటక 28.09 లక్షల కోట్ల జిడిఎస్‌పి(GDSP) నమోదు చేసింది. తలసరి ఆదాయం విషయానికి వస్తే 3.31 లక్షల రూపాయలు నమోదు చేసింది. ఇది జాతీయ జిడిపి(GDP) లో 8.20 శాతంగా నిలిచింది.

Also Read: మల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ ఆరంభం.. 9 నెలల తర్వాత మళ్లీ దోస్తీ, కానీ..


కర్ణాటక తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ వరుసగా నిలిచాయి. మహారాష్ట్ర ఫస్ట్ నుంచే బాలీవుడ్‌కు కేంద్రంగా వ్యవహరించడం.. బడా పారీశ్రామిక వేత్తలకు కేరాఫ్‌గా ఉండటంతో తొలి స్థానంలో నిలిచింది. ఇక మరోవైపు 2030-37 ఆర్ధిక సంవత్సరం నాటికి దేశ తలసరి ఆదాయం రెండింతలు పెరగవచ్చని ఎస్ అండ్ పి గ్లోబల్ మార్కెట్ ఇంటిలిజెన్స్(S&P Global Market Intelligence) అంచనా వేసింది. 7 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరుగుతుందని తెలిపింది. వార్షిక వృద్ధి రేటు మాత్రం 6.7 శాతంగా కొనసాగుతుందని వెల్లడించింది.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×