BigTV English
Advertisement

Madhya Pradesh Road Accident: విషాదం.. పెళ్లి ఊరేగింపు మీదికి దూసుకెళ్లిన ట్రక్కు.. 5 గురు మృతి!

Madhya Pradesh Road Accident: విషాదం.. పెళ్లి ఊరేగింపు మీదికి దూసుకెళ్లిన ట్రక్కు.. 5 గురు మృతి!
madhya pradesh road accident
madhya pradesh road accident

5 People died in Madhya Pradesh Road Accident: ఎంతో ఆనందంగా, ఘనంగా జరుగుతున్న పెళ్లివేడుకలో ఓ ట్రక్కు తీవ్ర విషాదం నింపింది. పెళ్లి ఊరేగింపు బృందంపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందగా.. మరో 11 మందికి పైగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్ లోని రాయిసేన్ జిల్లాలో సోమవారం రాత్రి జరిగిందీ ఘటన. హోసంగాబాద్ నుంచి పిపరియా గ్రామానికి జాతీయ రహదారిపై ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లి ఊరేగింపుపైకి అటువైపు వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు జనాలను బలంగా ఢీ కొట్టింది.


Also Read: బస్సుపై తెగి పడిన హైటెన్షన్ వైరు.. ప్రయాణికులు సజీవ దహనం..

సమాచారం అందుకున్న పోలీసులు.. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన 11 మందిలో మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరగవచ్చని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి కారణమైన ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. కాగా.. క్షతగాత్రులు, మృతుల్లో వివాహ వేడుకలకు లైట్లు మోసే కూలీలు కూడా ఉన్నారని సుల్తాన్ పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రజత్ సారథే తెలిపారు. సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఖమారియా గ్రామానికి సమీపంలో ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు స్థానిక జిల్లా కలెక్టర్ అరవింద్ దూబే రూ.4 లక్షల నష్టపరిహారం, క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం రూ.50 వేలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.


Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×