E-Paper
Advertisement

Uttarakhand Tunnel Rescue : ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో ట్విస్ట్.. డిసెంబర్ 25 వరకూ నో ఛాన్స్

Uttarakhand Tunnel Rescue : ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో ట్విస్ట్.. డిసెంబర్ 25 వరకూ నో ఛాన్స్
Uttarakhand Tunnel Rescue status

Uttarakhand Tunnel Rescue status(Latest today news in India):

మరికొన్ని గంటల్లో బయటికి వచ్చేస్తామనుకున్న 41 మంది కూలీల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఆఖరి నిమిషంలో డ్రిల్లర్‌ మొరాయించడమే కాదు.. పూర్తిగా ధ్వంసమవడంతో డ్రిల్లింగ్‌ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దానిని రిపేర్‌ చేయడం కూడా ఇప్పట్లో కుదిరే పని కాదని నిపుణులు చేతులెత్తేయడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. అంతేకాదు వారంతా వచ్చే నెల 25 వరకూ ఆ సొరంగంలోనే ఉండాల్సి వస్తుందంటూ షాకింగ్ న్యూస్ చెప్పారు.

ఉత్తరాఖండ్‌లోని నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగం కూలి రెండు వారాలు పూర్తయినా.. కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఏదో ఒక అడ్డు తగులుతూనే ఉంది. అంత సజావుగా సాగుతుంది.. మరి కొద్ది గంటల్లో బయటకు వచ్చేస్తారని అనుకుంటున్న సమయంలో భారీ ఆశలు పెట్టుకున్న యంత్రాలు మోరాయిస్తున్నాయి. ఇప్పటి వరకూ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో కార్మికులు బయటకు ఎప్పుడొస్తారనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.

డ్రిల్లింగ్‌ చేస్తున్న ఆగర్ మెషిన్ శిథిలాల్లో ఇరుక్కుపోయింది. దీని బ్లేడ్లను కత్తిరించేందుకు ప్లాస్మా కట్టర్‌ అవసరమని చెబుతున్నారు అధికారులు. దీనిని హైదరాబాద్‌ నుంచి విమాన మార్గంలో తరలించారు. అది ప్రమాద ప్రాంతానికి చేరుకున్నాక ఇక మాన్యువల్‌ డ్రిల్లింగ్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి.

ఆస్ట్రేలియాకు చెందిన మైక్రో టన్నెల్ నిపుణుడు అర్నాల్ డిక్స్ సంచలన విషయాలను తెలిపాడు. లోపలి చిక్కుకున్న 41 మంది కార్మికులు క్రిస్మస్ పండుగ నాటికి బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. తాము చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదని.. పర్వతంతో తాము చేస్తున్న పోరాటంలో మరోసారి ఓడిపోయామన్నారు. ఓపికగా వేచి ఉండాలని.. కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకురావడమే తమ లక్ష్యమంటున్నారు నిపుణులు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×