E-Paper
Advertisement

Uttarakhand Tunnel: శరవేగంగా డ్రిల్లింగ్ పనులు.. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో హైటెన్షన్

Uttarakhand Tunnel: శరవేగంగా డ్రిల్లింగ్ పనులు.. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో హైటెన్షన్

Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్​‌లోని ఉత్తరకాశీలో సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు 17వ రోజుకు చేరుకున్నాయి. సహాయక సిబ్బంది మేన్యువల్​ డ్రిల్లింగ్​ ప్రక్రియ చేపట్టారు. మంగళవారం ఉదయానికి 51.5 మీటర్లు వరకు పూర్తి అయిన తవ్వకాలు. లోపల చిక్కుకున్న కార్మికులకు సహాయక సిబ్బంది 5 మీటర్ల దూరంలోనే ఉన్నట్టు అధికారులు తెలిపారు. అయితే.. ఇంకా చాలా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 24 మంది నిపుణులు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. శిథిలాలను తొలగిస్తూ, సురక్షితమైన మార్గాన్ని డ్రిల్​ చేయడం కత్తిమీద సాములా మారిందని సమాచారం. ఎంత కష్టమైనా కార్మికుల దగ్గరకు చేరుకొని వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు.

అయితే, వాతావరణ పరిస్థితులు కూడా చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ ప్రాంతంలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇదే జరిగితే.. సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడవచ్చు. ఇక కార్మికుల దగ్గరకు చేరుకున్న తర్వాత.. వారిని బయటకు తీసుకురావడం కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారికి హెల్మేట్లు, యూనిఫామ్​లు, మాస్క్​లు, గ్లాసెస్ రెడీ చేశారు. టన్నెల్​లో చిక్కుకున్న కార్మికుల మానసిక ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మొదటి నుంచి ఈ విషయంలో జాగ్రత్తపడుతున్న అధికారులు.. ఓ పైప్​ ద్వారా ల్యాండ్​ లైన్​ని వారి వద్దకు పంపిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు .. సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు వారితో అధికారులు, వైద్యులు మాట్లాడుతున్నారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×