E-Paper
Advertisement

HC on Gyanvapi masjid : జ్ఞానవాపి మసీదుపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు.. సర్వేకు అనుమతి..

HC on Gyanvapi masjid : జ్ఞానవాపి మసీదుపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు.. సర్వేకు అనుమతి..
Advertisement
Gyanvapi mosque court order today

Gyanvapi mosque court order today(Breaking news of today in India) :

వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. శాస్త్రీయ సర్వే చేసేందుకు ఏఎస్ఐకు అనుమతి ఇచ్చింది. సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. సర్వేపై ముస్లిం పక్షాల చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. సర్వే వల్ల మసీదుకు ఎలాంటి నష్టం జరగకూడదని న్యాయస్థానం స్పష్ట చేసింది. వాస్తవాలు బయటకు రావాలంటే సర్వే జరగాల్సిందేనని తేల్చిచెప్పింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వేచేస్తామని ఏఎస్ఐ ఏడీజీ త్రిపాఠి ప్రకటించారు.

మసీదులో ఆర్కియాలజీ సర్వేపై గురువారం వరకు స్టే విధిస్తూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయించాలన్న కింది కోర్టు ఆదేశాలపై అలహాబాద్ హైకోర్టు స్టే పొడిగించింది. జ్ఞానవాపి మసీదును ఓ ఆలయంపై నిర్మించారా అనే విషయంపై సర్వే నిర్వహించాలంటూ ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను జిల్లా కోర్టు ఆదేశించింది. దీనిపై అంజుమన్ ఇంతెజామియా మసీద్ కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జ్ఞానవాపిలో ASI సర్వేకు తొలుత గురువారం వరకు స్టే విధించింది. తాజాగా మరోసారి వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Advertisement

మరోవైపు వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న హిందూ దేవతల చిహ్నాలను పరిరక్షించాలంటూ మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. అలహాబాద్‌ హైకోర్టు, వారణాసి జిల్లా కోర్టుల్లో బుధవారం రెండు పిటిషన్లు దాఖలు చేశారు. సర్వే సమయంలో హిందూ చిహ్నాలకు నష్టం కలగకుండా జ్ఞానవాపి మసీదు ప్రాంగణం మొత్తానికీ సీల్‌ వేయాలని పిటిషనర్లు కోరారు. మసీదు ప్రాంగణంలోని హిందూ చిహ్నాలను కొందరు ముస్లింలు ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తూ మరోవ్యక్తి వారణాసి కోర్టులో కేసు వేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరగనుంది.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×