E-Paper
Advertisement

HC on Gyanvapi masjid : జ్ఞానవాపి మసీదుపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు.. సర్వేకు అనుమతి..

HC on Gyanvapi masjid : జ్ఞానవాపి మసీదుపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు.. సర్వేకు అనుమతి..
Gyanvapi mosque court order today

Gyanvapi mosque court order today(Breaking news of today in India) :

వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. శాస్త్రీయ సర్వే చేసేందుకు ఏఎస్ఐకు అనుమతి ఇచ్చింది. సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. సర్వేపై ముస్లిం పక్షాల చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. సర్వే వల్ల మసీదుకు ఎలాంటి నష్టం జరగకూడదని న్యాయస్థానం స్పష్ట చేసింది. వాస్తవాలు బయటకు రావాలంటే సర్వే జరగాల్సిందేనని తేల్చిచెప్పింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వేచేస్తామని ఏఎస్ఐ ఏడీజీ త్రిపాఠి ప్రకటించారు.

మసీదులో ఆర్కియాలజీ సర్వేపై గురువారం వరకు స్టే విధిస్తూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయించాలన్న కింది కోర్టు ఆదేశాలపై అలహాబాద్ హైకోర్టు స్టే పొడిగించింది. జ్ఞానవాపి మసీదును ఓ ఆలయంపై నిర్మించారా అనే విషయంపై సర్వే నిర్వహించాలంటూ ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను జిల్లా కోర్టు ఆదేశించింది. దీనిపై అంజుమన్ ఇంతెజామియా మసీద్ కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జ్ఞానవాపిలో ASI సర్వేకు తొలుత గురువారం వరకు స్టే విధించింది. తాజాగా మరోసారి వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మరోవైపు వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న హిందూ దేవతల చిహ్నాలను పరిరక్షించాలంటూ మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. అలహాబాద్‌ హైకోర్టు, వారణాసి జిల్లా కోర్టుల్లో బుధవారం రెండు పిటిషన్లు దాఖలు చేశారు. సర్వే సమయంలో హిందూ చిహ్నాలకు నష్టం కలగకుండా జ్ఞానవాపి మసీదు ప్రాంగణం మొత్తానికీ సీల్‌ వేయాలని పిటిషనర్లు కోరారు. మసీదు ప్రాంగణంలోని హిందూ చిహ్నాలను కొందరు ముస్లింలు ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తూ మరోవ్యక్తి వారణాసి కోర్టులో కేసు వేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరగనుంది.

Related News

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

Big Stories

×