E-Paper
Advertisement

Vijayapura: గుండెల్ని పిండేసే విషాదం.. జొన్నమూటల కింద నలిగిన ప్రాణాలు

Vijayapura: గుండెల్ని పిండేసే విషాదం.. జొన్నమూటల కింద నలిగిన ప్రాణాలు
Advertisement
Vijayapura news

Vijayapura news(Telugu news updates):

మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్ణాటకకు చెందిన విజయపుర పట్టణంలో ఘోర దుర్ఘటన జరిగింది. జొన్నమూటలు మీద పడటంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన అక్కడున్నవారి గుండెల్ని పిండేసింది. విజయపుర పట్టణ శివారులోని రాజగురు పరిశ్రమ గోదాములో సోమవారం (డిసెంబర్ 4) రాత్రి ఈ ఘటన జరిగింది. గోదాములో ఉన్న జొన్నమూటలు దొర్లి.. అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడటంతో.. వాటి కింద 11 మంది చిక్కుకున్నారు. సోమవారం రాత్రే నలుగురిని కాపాడి ఆసుపత్రికి తరలించగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మరో ఏడుగురు మూటల కిందే నలిగి మృతి చెందారు. మృతులను బీహార్ కు చెందిన రాజేశ్ ముఖియా (25), రామ్రిజ్ ముఖియా (29), సంబూ ముఖియా (26), రామ్ బాలక్ (38), లోఖి జాధవ్ (56), కిషన్ కుమార్ (20), దాలనచంద ముఖియా (31)లుగా గుర్తించారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారని, రక్తసంబంధీకులని విజయపుర జిల్లా అధికారి టి.భూబాలన్ వెల్లడించారు.

Advertisement

భారీయంత్రం పక్కనే వందల మూటలుండటంతో.. ఆ యంత్రం కుదుపులకు మూటలు ఒక్కసారిగా కుప్పకూలి ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. కార్మికులు చనిపోయిన పరిశ్రమ యాజమాన్యంపై విజయపుర గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. సంస్థ యజమాని అయిన కిశోర్ కుమార్ జైన్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారాలను అందజేస్తామని ప్రకటించారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×