E-Paper
Advertisement

Budget 2024 : మధ్యతరగతికి ఊరట లభించేనా?

Budget 2024 : మధ్యతరగతికి ఊరట లభించేనా?

Budget 2024 : ప్రస్తుతం ప్రవేశపెడుతున్న బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్టే అయినా.. తమకు కొంతైనా ఊరట లభిస్తుందేమోనని వేతన జీవులు, మధ్య తరగతి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ పన్ను వ్యయాన్ని తగ్గించడానికి వీలు కల్పించేలా సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ వంటి వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపు పరిమితులను పెంచితే బాగుండునని కోరుకుంటున్నారు.

ఆదాయపన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలను రెట్టింపు చేయాలని అభిలషిస్తున్నారు. నిరుడు బడ్జెట్ సమయంలో కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకునే వారి కోసం స్లాబ్ రేట్లను సవరించిన సంగతి తెలిసిందే. సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు పరిమితి రూ.1.5 లక్షలుగా ఉంది. దశాబ్దకాలంగా ఆ పరిమితిలో ఏ మార్పూ లేదు. ఈ సారైనా దానిని రూ.2.5 లక్షలకు పెంచాలని ఆశిస్తున్నారు.

2018లో స్టాండర్డ్ డిడక్షన్ విధానం అమల్లోకి వచ్చింది. రూ.40 వేల నుంచి ఇది ఆరంభమవుతుంది. 2019లో ఆ పరిమితిని రూ.50 వేలకు చేర్చారు. ఐదేళ్లుగా బడ్జెట్లు ప్రవేశపెడుతున్నా… దానిలో ఎలాంటి మార్పులూ చేయలేదు. ఈ సారైనా దానిని రూ.లక్షకు పెంచాలని అభ్యర్థన పలు వర్గాల నుంచి వస్తోంది. అలాగే సెక్షన్ 80 సీ, 80 డీ డిడక్షన్ ప్రయోజనాలను విస్తరించాలని కోరుకుంటున్నారు. ఎన్నికల అనంతరం కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను జూలైలో ప్రవేశపెడుతుంది.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×