BigTV English
Advertisement

Budget 2024 : మధ్యతరగతికి ఊరట లభించేనా?

Budget 2024 : మధ్యతరగతికి ఊరట లభించేనా?

Budget 2024 : ప్రస్తుతం ప్రవేశపెడుతున్న బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్టే అయినా.. తమకు కొంతైనా ఊరట లభిస్తుందేమోనని వేతన జీవులు, మధ్య తరగతి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ పన్ను వ్యయాన్ని తగ్గించడానికి వీలు కల్పించేలా సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ వంటి వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపు పరిమితులను పెంచితే బాగుండునని కోరుకుంటున్నారు.


ఆదాయపన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలను రెట్టింపు చేయాలని అభిలషిస్తున్నారు. నిరుడు బడ్జెట్ సమయంలో కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకునే వారి కోసం స్లాబ్ రేట్లను సవరించిన సంగతి తెలిసిందే. సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు పరిమితి రూ.1.5 లక్షలుగా ఉంది. దశాబ్దకాలంగా ఆ పరిమితిలో ఏ మార్పూ లేదు. ఈ సారైనా దానిని రూ.2.5 లక్షలకు పెంచాలని ఆశిస్తున్నారు.

2018లో స్టాండర్డ్ డిడక్షన్ విధానం అమల్లోకి వచ్చింది. రూ.40 వేల నుంచి ఇది ఆరంభమవుతుంది. 2019లో ఆ పరిమితిని రూ.50 వేలకు చేర్చారు. ఐదేళ్లుగా బడ్జెట్లు ప్రవేశపెడుతున్నా… దానిలో ఎలాంటి మార్పులూ చేయలేదు. ఈ సారైనా దానిని రూ.లక్షకు పెంచాలని అభ్యర్థన పలు వర్గాల నుంచి వస్తోంది. అలాగే సెక్షన్ 80 సీ, 80 డీ డిడక్షన్ ప్రయోజనాలను విస్తరించాలని కోరుకుంటున్నారు. ఎన్నికల అనంతరం కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను జూలైలో ప్రవేశపెడుతుంది.


Related News

Blood Flow ECMO: మరణించిన తర్వాత కూడా రక్త ప్రసరణ.. ఆసియాలో తొలిసారిగా ఎక్మో టెక్నిక్

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Big Stories

×