E-Paper
Advertisement

Budget 2024 : మధ్యతరగతికి ఊరట లభించేనా?

Budget 2024 : మధ్యతరగతికి ఊరట లభించేనా?
Advertisement

Budget 2024 : ప్రస్తుతం ప్రవేశపెడుతున్న బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్టే అయినా.. తమకు కొంతైనా ఊరట లభిస్తుందేమోనని వేతన జీవులు, మధ్య తరగతి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ పన్ను వ్యయాన్ని తగ్గించడానికి వీలు కల్పించేలా సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ వంటి వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపు పరిమితులను పెంచితే బాగుండునని కోరుకుంటున్నారు.

ఆదాయపన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలను రెట్టింపు చేయాలని అభిలషిస్తున్నారు. నిరుడు బడ్జెట్ సమయంలో కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకునే వారి కోసం స్లాబ్ రేట్లను సవరించిన సంగతి తెలిసిందే. సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు పరిమితి రూ.1.5 లక్షలుగా ఉంది. దశాబ్దకాలంగా ఆ పరిమితిలో ఏ మార్పూ లేదు. ఈ సారైనా దానిని రూ.2.5 లక్షలకు పెంచాలని ఆశిస్తున్నారు.

Advertisement

2018లో స్టాండర్డ్ డిడక్షన్ విధానం అమల్లోకి వచ్చింది. రూ.40 వేల నుంచి ఇది ఆరంభమవుతుంది. 2019లో ఆ పరిమితిని రూ.50 వేలకు చేర్చారు. ఐదేళ్లుగా బడ్జెట్లు ప్రవేశపెడుతున్నా… దానిలో ఎలాంటి మార్పులూ చేయలేదు. ఈ సారైనా దానిని రూ.లక్షకు పెంచాలని అభ్యర్థన పలు వర్గాల నుంచి వస్తోంది. అలాగే సెక్షన్ 80 సీ, 80 డీ డిడక్షన్ ప్రయోజనాలను విస్తరించాలని కోరుకుంటున్నారు. ఎన్నికల అనంతరం కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను జూలైలో ప్రవేశపెడుతుంది.

Related News

వాహనదారులకు గుడ్‌న్యూస్.. టోల్‌ ప్లాజాల వద్ద ఆగకుండానే నేరుగా, ఫిబ్రవరి నుంచే అమల్లోకి!

‘చిన్నారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం’.. ఇన్‌ఫ్లుయెన్సర్ వేధింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఉత్కంఠకు చెక్.. భారత్‌లో చైనా అధ్యక్షుడి పర్యటన ఖరారు.. బ్రిక్స్ సదస్సుకు హాజరు

గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!

సీఎం విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అవును విజయ్.. నా దవడ విరిగింది?

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!

పెళ్లి తర్వాత కూడా మహిళల సమ్మతి ముఖ్యమే.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం!

Big Stories

Advertisement
×