BigTV English
Advertisement

Mizoram Election Results : మిజోరంలో ZPM విజయం.. ఎన్నికల్లో ఓడిన సిఎం, డిప్యూటీ సీఎం

Mizoram Election Results : భారత దేశంలో ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో నవంబర్ 7న అసెంబ్లీ ఎన్నికల జరిగాయి. అయితే ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన మిజో నేషనల్ ఫ్రంట్‌ (MNF)కు గట్టి షాక్‌ తగిలింది. ఏకంగా ముఖ్యమంత్రి జోరంతంగాతో పాటు డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు.

Mizoram Election Results : మిజోరంలో ZPM విజయం.. ఎన్నికల్లో ఓడిన సిఎం, డిప్యూటీ సీఎం

Mizoram Election Results : భారత దేశంలో ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో నవంబర్ 7న అసెంబ్లీ ఎన్నికల జరిగాయి. అయితే ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన మిజో నేషనల్ ఫ్రంట్‌ (MNF)కు గట్టి షాక్‌ తగిలింది. ఏకంగా ముఖ్యమంత్రి జోరంతంగాతో పాటు డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు. మొత్తం 40 సీట్లున్న మిజోరం అసెంబ్లీ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేజిక్ ఫిగర్ 21 సాధించాలి.


అయితే ప్రతిపక్ష కూటమి జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (ZPM)కి ఇప్పటికే స్పష్టమైన మెజార్టీ లభించింది. 40 అసెంబ్లీ స్థానాలకు గాను 21 స్థానాల్లో ZPM విజయం సాధించింది. మరో 6 స్థానాల్లో ఆధికయంలో ఉంది. అధికార MNF పార్టీకి ఇప్పటికి 6 సీట్లు గెలిచి.. మరో 4 చోట్ల ముందంజలో ఉంది. బిజేపీ రెండు స్థానాల్లో, కాంగ్రెస్ ఒక సీటుపై ఆధిక్యంలో ఉన్నారు.

ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జోరతంగా 2100 ఓట్లతో ఓడిపోయారు. ఉపముఖ్యమంత్రి తుయ్‌చాంగ్ 909 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మరోవైపు ZPM ముఖ్యమంత్రి అభ్యర్థి లాల్ దుహోమా సెర్చిప్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. బిజేపీ గత ఎన్నికల్లో ఒక సీటు పరిమితమవగా.. ఈసారి రెండు సీట్లు గెలుచుకుంది. అయితే కాంగ్రెస్ గత ఎన్నికల్లో అయిదు సీట్లు గెలుచుకోగా.. ఈసారి కేవలం ఒకసీటుకే పరిమితమైంది.


MNF పార్టీ గతంలో బిజేపీతో పొత్తు పెట్టుకుంది. మరి ఈ సారి గెలిచిన ZPM జాతీయ స్థాయిలో ఎవరికి మద్దతుగా ఉంటుందో చూడాలి.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×