Action Thriller OTT : 1998లో ఇండోనేషియాలో జరిగిన అల్లర్ల ఆధారంగా ఓ సినిమా తెరకెక్కింది. ఒక స్కూల్లో టీచర్గా చేరిన ఎడ్విన్, అక్కడ జరిగే అల్లర్ల మధ్య తన మేనల్లుడిని కాపాడుకోవడానికి చేసే పోరాటమే ఈ చిత్రం. యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి. ఓటీటీలో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ముఖ్యంగా యాక్షన్ ప్రియులు అస్సలు మిస్ కాకూడని సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..
ఈ ఇండోనేషియా డిస్టోపియన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు ‘సీజ్ ఎట్ థోర్న్ హై’ (The Siege at Thorn High). దీనిని ప్రముఖ దర్శకుడు జోకో అన్వర్ రూపొందించారు. ఇందులో మోర్గాన్ ఓయ్, ఒమరా ఎస్టెగ్లాల్, హనా మలాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అమెజాన్ MGM స్టూడియోస్ 17 ఏప్రిల్ 2025న మెట్రో-గోల్డ్విన్-మేయర్ ద్వారా విడుదల చేసింది. 2025 ఆగస్టు 15 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది 2025 ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ది షాడో స్ట్రేస్’తో పాటు అత్యధిక నామినేషన్లను అందుకుంది.
ఎడ్విన్ అనే వ్యక్తి ఒక స్కూల్లో టీచర్గా చేరతాడు. కానీ అతను అక్కడికి వచ్చింది కేవలం పాఠాలు చెప్పడానికి కాదు, తప్పిపోయిన తన మేనల్లుడిని వెతకడానికి. ఆ స్కూల్ చాలా ప్రమాదకరమైనది. అక్కడ అంతా గొడవలు చేసే కుర్రాళ్లే ఉంటారు. సరిగ్గా అదే సమయంలో బయట నగరంలో జాతి వివక్ష వల్ల పెద్ద ఎత్తున అల్లర్లు మొదలవుతాయి. ఆ గొడవలు స్కూల్ లోపలికి కూడా పాకుతాయి. దీంతో స్కూల్ ఒక యుద్ధభూమిలా మారిపోతుంది. బయట జరుగుతున్న హింసను చూసి స్కూల్లోని విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడతారు.
ఆ గందరగోళంలో ఎడ్విన్ తన మేనల్లుడిని కాపాడుకుంటూ, తను కూడా ప్రాణాలతో బయటపడటానికి పోరాడాల్సి వస్తుంది. చివరికి ఎడ్విన్ తన మేనల్లుడిని కావాడుకున్నాడా ? అసలు చిన్నప్పుడే అతను ఎలా తప్పిపోయాడు ? ఎడ్విన్ గతం ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : జోంబీగా మారే కూతురు… తండ్రి మాస్టర్ ప్లాన్… ఒక్కసారి చూస్తే జీవితంలో మర్చిపోలేరు భయ్యా