Court Room Darama Series : ఓటీటీలోకి ఇక బెంగాలీ కోర్టు డ్రామా వెబ్ సిరీస్ రీసెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చింది. తన బాస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కోర్టుకు వెళ్ళే జయితా అనే యువతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కోర్టు డ్రామా వెబ్ సిరీస్ లను ఇస్టపడే వాళ్ళుకు ఈ సిరీస్ బెస్ట్ ఛాయిస్. అయితే ఇందులో అ*డల్ట్ కంటెంట్ ఉన్నందున దీనికి 18+ రేటింగ్ ఇవ్వబడింది. పిల్లలు ఈ సిరీస్ కి దూరంగా ఉండటమే మంచిది. దీని పేరు ఏంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
ఈ బెంగాలీ కోర్టు డ్రామా వెబ్ సిరీస్ పేరు ‘అదాలత్ ఓ ఏక్టి మేయే’ (Adalat O Ekti Meye). ఇది 2026 ఫిబ్రవరి 20 నుండి ప్రముఖ బెంగాలీ ఓటీటీ ప్లాట్ ఫామ్ hoichoi లో స్ట్రీమింగ్ అవుతోంది. కమలేశ్వర్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో కౌషాని ముఖర్జీ, కౌశిక్ సేన్, బసబ్దత్త ఛటర్జీ, రాహుల్ అరుణోదయ బెనర్జీ వంటి నటులు నటించారు. ఇది 1981లో వచ్చిన తపన్ సిన్హా క్లాసిక్ సినిమా ‘అదాలత్ ఓ ఏక్టి మేయే’ ఆధునిక వెర్షన్. మొత్తం 7 ఎపిసోడ్లతో ఈ సిరీస్ రూపొందింది. ప్రతి ఎపిసోడ్ కథను ఒక్కో మలుపు తిప్పుతుంది.
జయిత అనే అమ్మాయి ఒక కార్పొరేట్ కంపెనీలో పని చేస్తూ ఉంటుంది. తన బాస్ డీకే తనపై లైంగిక దాడి చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ మొదలవుతుంది. అయితే ఈ కేసు పెట్టవద్దని జయిత కుటుంబ సభ్యులు ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తెస్తారు. సమాజం ఏమనుకుంటుందో అన్న భయం ఒకవైపు, తన ఆత్మగౌరవం కోసం పోరాడాలనే పట్టుదల మరోవైపు.. ఈ రెండింటి మధ్య జయిత చేసే పోరాటమే ఈ సిరీస్. అయితే కోర్టులో ఈ కేసు విచారణ మొదలైనప్పుడు అసలు కష్టాలు మొదలవుతాయి. జయితకు ఆ రోజు జరిగిన సంఘటనలు పూర్తిగా గుర్తుండవు. దీన్నే అడ్డం పెట్టుకుని ప్రత్యర్థి తరపు లాయర్ ఆమెను ఇబ్బంది పెడతాడు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? నిజంగానే ఆమెపై అఘాయిత్యం జరిగిందా ? మరో మలుపు ఉందా? చివరికి కోర్టులో ఎలాంటి నిజం బయటపడింది? అనే విషయాలు ఉత్కంఠభరితంగా సాగుతాయి.
Read Also : జోంబీగా మారే కూతురు… తండ్రి మాస్టర్ ప్లాన్… ఒక్కసారి చూస్తే జీవితంలో మర్చిపోలేరు భయ్యా