Charitha Kamakshi OTT : ఎట్టకేలకు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది తెలుగు రొమాంటిక్ మూవీ ‘చరిత కామాక్షి’(Charitha Kamakshi). ఈ లో బడ్జెట్ రొమాంటిక్ డ్రామా ఓటీటీలోకి వచ్చేందుకు దాదాపు 4 ఏళ్లు పట్టింది. ‘కలర్ ఫోటో’ సినిమాలో కీలక పాత్రలో నటించిన దివ్య శ్రీపాద, ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా 2022లో థియేటర్లో రిలీజ్ కావాల్సి ఉండగా, అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు థియేటర్లకు వెళ్ళకుండా డైరెక్ట్గా ఓటీటీలోకి వచ్చేసింది. భార్యాభర్తల చుట్టూ తిరిగే ఈ కథలో రొమాంటిక్ సీన్స్ తో పాటు, ఎమోషన్స్, షాకింగ్ ట్విస్ట్లు కూడా ఉంటాయి. భారీ ఫైట్లు, డ్యాన్సులు కాకుండా.. కేవలం ఇద్దరు మనుషుల మధ్య ఉండే ఎమోషన్స్ చుట్టూ ఈ కథ నడుస్తుంది.
నటి దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలో నటించిన ‘చరిత కామాక్షి’ (Charitha Kamakshi)లో ఆమెకు జోడీగా అభయ్ నవీన్ నటించారు. శ్రీలంక చందు సాయి ఈ సినిమాకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఈటీవీ విన్’ (ETV Win) ఈ సినిమా డిజిటల్ రైట్స్ను దక్కించుకుంది. 2026 మార్చి 5 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో బబ్లూ పృథ్వీరాజ్, మణికంఠ వారణాసి, సతీష్ సారిపల్లి, అంజి మామ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అబు సంగీతాన్ని అందించగా, రజినీ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
చరిత (దివ్య శ్రీపాద), చక్రి (అభయ్ నవీన్) ఇద్దరూ కొత్తగా పెళ్లయిన ఒక జంట. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి, చిన్న చిన్న సంతోషాలు, అప్పుడప్పుడు వచ్చే గొడవలతో వాళ్ల లైఫ్ సరదాగా సాగిపోతుంటుంది. అయితే ఇద్దరకి ఆ ముచ్చట తీరాడానికి కొంచెం టైమ్ తీడుకుంటే మంచిదని అనుకుంటారు. వాళ్ల లైఫ్ అంతా హ్యాపీగా సాగుతుందనుకున్న టైంలో ఒక పెద్ద సమస్య వచ్చి పడుతుంది. సినిమా డైరెక్టర్ కావాలని కలలు కనే చక్రి ఓ కేసులో ఇరుక్కుని కటకటాలపాలవుతాడు. చక్రిని బయట వదిలిపెట్టడానికి ఒక కండిషన్ పెడతాడు ఇన్స్పెక్టర్. ఆ కండిషన్ విని చరితకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ కండిషన్ ఏమిటి ? చరిత దానికి ఒప్పుకుంటుందా ? చక్రి చేసిన తప్పు ఏమిటి ? అతను జైలు నుంచి బయటకు వస్తాడా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకొనాల్సిందే.
Read Also : 47 అవార్డులతో ప్రశంసలు… అప్పు ఇచ్చిన బ్యాంకుకే కన్నం… చూసే కొద్దీ చూడాలనిపించే మూవీ