E-Paper
Advertisement

ఓటీటీలో హత్రాస్ అరాచకం.. చూస్తే కన్నీళ్ళు ఆగవు మావా

ఓటీటీలో హత్రాస్ అరాచకం.. చూస్తే కన్నీళ్ళు ఆగవు మావా
Advertisement

Documentary Series on OTT : రియల్ స్టోరీస్ ఎన్నెన్నో ఓటీటీలలో అందుబాటులో ఉన్నాయి. కానీ తాజాగా దేశాన్ని అల్లకల్లోలం చేసిన ‘హత్రాస్’ ఘటనపై రూపొందిన డాక్యుమెంటరీ సిరీస్ ఒకటి ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. దాన్ని చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్ళు ఆగవు. రక్తం ఉడికిపోతుంది. మరి ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అసలు కథ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

జీ5 ఓటీటీలో అందుబాటులో…

Hathras 16 Days (2026) అనే టైటిల్ తో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ ఇది. భారతదేశాన్ని తీవ్రంగా కుదిపేసిన 2020 నాటి హత్రాస్ దారుణ సంఘటన ఆధారంగా రూపొందింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ లో ఒక యువ దళిత మహిళపై జరిగిన దాడి నుండి మొదలు పెడితే, ఆమె మరణం తర్వాత అర్ధరాత్రి జరిగిన బలవంతపు అంత్యక్రియల వరకు ఓ ఒక్క నిజాన్ని దాచకుండా చూపించారు ఇందులో. 16 రోజులలో ఏం జరిగిందనేది ఈ సిరీస్ లో క్లియర్ గా చూడవచ్చు. పాట్రిక్ గ్రాహం దర్శకత్వంలో రూపొందిన ఈ డాక్యు-సిరీస్ మే 15 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5 లో ప్రసారం అవుతోంది. ఈ డాక్యుమెంటరీ విడుదలైన తర్వాత ఈ కేసును రీ ఓపెన్ చేయాలనే డిమాండ్ వినబడుతోంది. ముఖ్యంగా ఇందులో చూపించిన సంచలన నిజాల ఆధారంగా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఈ కేసుపై మళ్లీ కొత్తగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తుండడం గమనార్హం.

స్టోరీలోకి వెళ్తే..

Advertisement

ఆ 16 రోజుల నరకం చుట్టూనే కథ అంతా నడుస్తుంది. 2020 సెప్టెంబర్ 14న ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన 19 ఏళ్ల దళిత యువతి స్టోరీ ఇది. ఆమెపై అగ్రవర్ణానికి చెందిన కొందరు వ్యక్తులు అత్యంత దారుణంగా అఘాయిత్యానికి పాల్పడతారు. దీంతో తీవ్రమైన వెన్నెముక గాయాలతో ఆమె ఢిల్లీ ఆసుపత్రిలో రెండు వారాల పాటు ప్రాణాలతో పోరాడుతుంది. కానీ సెప్టెంబర్ 29న మృత్యువాత పడుతుంది. అయితే ఆమెపై దాడి జరిగిన రోజు నుండి.. మరణించిన తర్వాతి రోజు వరకు గడిచిన ఆ 16 రోజులలో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగకుండా వ్యవస్థ, రాజకీయం ఎలా అడ్డుపడ్డాయనేదే ఈ 3 ఎపిసోడ్ల సిరీస్ ప్రధాన కథాంశం. ఈ కేసులోనే కాకుండా భారత చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన, కలచివేసే ఘట్టం ఏదైనా ఉందా అంటే అది ఆమె దహన సంస్కారాలే. బాధితురాలి శవాన్ని అర్ధరాత్రి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా పోలీసులు బలవంతంగా దహనం చేయడం అత్యంత దారుణం.

సెప్టెంబర్ 30 తెల్లవారుజామున 2:30 గంటలకు హిందూ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. కనీసం కూతురి ముఖాన్ని తల్లిదండ్రులకు చూపించకుండా పోలీసులు చేసిన అరచకాన్ని ఈ డాక్యుమెంటరీలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ సిరీస్‌కు జర్నలిస్ట్ తనుశ్రీ పాండే చేసిన ఇన్వెస్టిగేషన్ వెన్నెముకగా నిలిచిందని చెప్పాలి. ఆమె నిర్భయంగా నిజాలన్నింటినీ బయట పెట్టారు. అలాగే కుముద్ మిశ్రా, అంజలి శివరామన్, పవైల్ గులాటి ఇందులో కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు.

Advertisement

Read Also : బ్రూస్ లీ కథ ఆధారంగా వచ్చిన మార్షల్ ఆర్ట్స్ సిరీస్… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Tags

Related News

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

14,000 ఏళ్ల వయసున్న టీచర్… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులున్న క్లాసిక్ సై-ఫై మూవీ

Big Stories

Advertisement
×