Horror Movie OTT : ఇండోనేషియా నుంచి ఎక్కువగా హారర్ థ్రిల్లర్ సినిమాలు వస్తుంటాయి. ఈ సినిమాలలో భయపెట్టే సీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా ఊహించని ట్విస్టులతో ఆడియన్స్ ని బాగానే భయపెట్టింది. ఈ మూవీ ఒక ట్రైన్ జర్నీ చుట్టూ తిరుగుతుంది. ఇక ఆ ట్రైన్ లో వచ్చే సీన్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. ఎందుకంటే అక్కడ దెయ్యాలు హల్చల్ చేస్తాయి కాబట్టి. ఈ సినిమాని ఒంటరిగా చూస్తే ఇక అంతే సంగతులు. ఈ స్టోరీ ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
2024లో విడుదలైన ఈ ఇండోనేషియా హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది ట్రైన్ ఆఫ్ డెత్’ (The Train of Death). ఇండోనేషియా భాషలో దీని అసలు పేరు ‘కెరెటా బెర్దారా’ (Kereta Berdarah). దీనికి రిజాల్ మంటోవాని దర్శకత్వం వహించారు. ఇందులో హనా మలాసన్, జారా లియోలా, పుత్రి ఆయుద్య లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా ఇండోనేషియాలో 2024 ఫిబ్రవరి 1 న విడుదలైంది. ప్రస్తుతం Netflix లో అందుబాటులో ఉంది.
Read Also : 25 ఏళ్లుగా క్రైమ్ అంటే ఏంటో తెలియని గ్రామం… బైక్ మిససవ్వడంతో గడబిడ… కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్
పూర్ణిమ అనే యువతి ప్రాణాంతకమైన క్యాన్సర్ నుండి కొలుకుంటూ ఉంటుంది. ఈ ఆనందాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి తన చెల్లెలు కెంబంగ్ తో కలిసి సంకారా అనే కొత్త రిసార్ట్కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. ఆ రిసార్ట్కు చేరుకోవడానికి వీళ్ళు సంకారా ఎక్స్ప్రెస్ అనే ఒక విలాసవంతమైన ట్రైన్ ఎక్కుతారు. ఈ రైలు మార్గం దట్టమైన అడవుల గుండా వెళ్తుంది. మధ్యలో ఐదు చీకటి సొరంగాలు కూడా వస్తాయి. ఇక ప్రయాణం మొదలైన కొంతసేపటికే వింత సంఘటనలు మొదలవుతాయి. రైలు ఒక్కో సొరంగం దాటుతున్న ప్రతిసారీ, చివరిలో ఉన్న ఒక బోగీ పూర్తిగా మాయమైపోతుంటుంది. ఆ బోగీలో ఉన్న ప్రయాణికులు ఏమయ్యారో ఎవరికీ తెలియదు.
ఇక సొరంగంలోకి ప్రవేశించినప్పుడు చీకట్లో భయంకరమైన ఆకారాలు, దయ్యాలు ప్రయాణికులపై దాడి చేయడం మొదలుపెడతాయి. ఐదు సొరంగాలు దాటేలోపు రైలులోని వారందరూ చనిపోతారని తెలుసుకున్న పూర్ణిమ, తన చెల్లెలిని కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడుతుంది. చివరికి పూర్ణిమ తన చెల్లితో పాటు ఈ ప్రమాదం నుంచి బయట పడుతుందా ? రైలు బోగీలు ఎలా మాయమవుతున్నాయి ? అనే విషయాలను ఈ ఇండోనేషియా హారర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.