E-Paper
Advertisement

Bangladesh Minister: కాళ్లు ప‌ట్టుకున్నా ఇండియాలో అడుగుపెట్ట‌బోం..పాకిస్తాన్ లో టీ20 ప్ర‌పంచ క‌ప్ ఆడ‌తాం !

Bangladesh Minister: కాళ్లు ప‌ట్టుకున్నా ఇండియాలో అడుగుపెట్ట‌బోం..పాకిస్తాన్ లో టీ20 ప్ర‌పంచ క‌ప్ ఆడ‌తాం !

Bangladesh Minister: ఇండియా ( India) అలాగే బంగ్లాదేశ్ ( Bangladesh) మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముస్తాఫిజుర్ రహమాన్ ( Mustafizur Rahman)  ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ( IPL 2026 ) ఆడకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India) ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య దూరం పెరిగిపోయింది. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ 2026 ప్రసారాలపై బ్యాన్ వేయడమే కాకుండా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్  ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో ఇండియాలో పర్యటించబోమంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ( Bangladesh Cricket Board ) సంచలన ప్రకటన చేసింది. దీంతో ఇండియాకు బంగ్లాదేశ్ జట్టు రావడం పై సందిగ్ధత నెలకొంది.

Also Read: BPL: చ‌రిత్ర‌లో తొలిసారి.. ఒకే మ్యాచ్ లో తండ్రి, కొడుకులు..ముస్తాఫిజుర్ మెంటెలోడు అంటూ ప‌రువు తీసిన‌ న‌బీ

ఇండియాకు బంగ్లాదేశ్ రావడంపై క్రీడామంత్రి సంచలన ప్రకటన

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  నేపథ్యంలో ఇండియాలో బంగ్లాదేశ్ పర్యటించడంపై ఆ దేశ క్రీడా శాఖ మంత్రి ఆసిఫ్ నజ్రుల్ ( Bangladesh Sports Ministry Asif Nazrul  ) కీలక ప్రకటన చేశారు. తమ బంగ్లాదేశ్ జట్టును వెనకేసుకు వస్తూ, ఇండియాలో పర్యటించబోమని మరోసారి తేల్చి చెప్పారు క్రీడా శాఖ మంత్రి ఆసిఫ్ నజ్రుల్. టి20 ప్రపంచ కప్ ఆడడానికి బంగ్లాదేశ్ జట్టు సిద్ధంగానే ఉంది… కానీ ఇండియాలో మాత్రం పర్యటించబోమని వెల్లడించారు. శ్రీలంక, దుబాయ్, లేదా చివరకు పాకిస్తాన్ గడ్డపైన టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) మ్యాచ్ లు ఆడతామని బంగ్లాదేశ్ స్పోర్ట్స్ మినిస్టర్ ఆసిఫ్ నజ్రుల్ వెల్లడించారు. కానీ ఇండియాలో మాత్రం పర్యటించబోం… సౌత్ ఇండియాలోనే కాదు భారతదేశంలోని ఏ ఒక్క నగరంలో కూడా తాము ఆడబోమని వెల్ల‌డించారు ఆసిఫ్ నజ్రుల్.

త‌మ కోసం బీసీసీఐ అనేక ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇండియాలోని ఇత‌ర వేదిక‌ల్లో మ్యాచ్ లు నిర్వ‌హించాల‌ని బీసీసీఐ స్కెచ్ లు వేస్తోంది.. కానీ మేం అస్స‌లు ఇండియాలో ప‌ర్య‌టించ‌బోమన్నారు బంగ్లాదేశ్ క్రీడా మంత్రిత్వ శాఖ ఆసిఫ్ నజ్రుల్ (Ministry Asif Nazrul  ). కాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ( Bangladesh Cricket Board ) రాసిన లేఖ‌పై ఇటీవ‌లే అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ICC) స్పందించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ అడిగిన‌ట్లుగా వేదిక‌లు మార్చ‌డం అస్స‌లు కుద‌ర‌బోద‌ని పేర్కొంంది ఐసీసీ. ఆడితే ఆడండి, లేక‌పోతే పాయింట్స్ క‌ట్ చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చింది. ఇండియాలో ప‌ర్య‌టిస్తే, సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామ‌ని ఐసీసీ తెలిపింది. ఎలాంటి హాని జ‌రుగ‌కుండా బంగ్లాదేశ్ టీమ్ ను సెఫ్టీగా ఉంచుతామ‌ని స్ప‌ష్టం చేసింది.

Also Read: Virat Kohli Century: కోహ్లీ ఫ్యాన్స్ అంద‌రూ ఫేక్ గాళ్లే..సెంచ‌రీ చేయ‌క‌పోతే అన్నమే తిన‌ను అన్నాడు, ఔట్ అయ్యాక లాగించేశాడు

 

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×