Horror Thriller OTT : ప్రస్తుత కాలంలో హారర్, సస్పెన్స్ సినిమాలకు క్రేజ్ భలే ఉంది. భయం కలిగించే కథలు, ఉత్కంఠ భరితమైన సీన్స్… ఇవన్నీ చూసి థ్రిల్ ఫీల్ అవుతాం కదా! వీకెండ్ కు పర్ఫెక్ట్ ఆప్షన్ గా అలాంటి మూవీ ఒకటి వచ్చేసింది. థియేటర్లలో హిట్ అయిన ఈ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ ఓటీటీలోనూ భయపెడుతోంది. ఈ సినిమాను ఒకసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపేయాలనిపించదు. మరి ఆ ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఇప్పుడు చెప్పుకుంటున్న హర్రర్ మూవీ పేరు ‘కిష్కింధపురి’ (Kishkindhapuri). బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జోడీగా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్లో వచ్చింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి మూవీని నిర్మించగా, సపోర్టింగ్ రోల్స్ లో శాండీ మాస్టర్ (విలన్గా), తనికెళ్ల భరణి, హైపర్ ఆది, శ్రీకాంత్ అయ్యంగార్, మకరంద్ దేశ్పాండే లాంటి వాళ్లు కనిపిస్తారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ మూవీతోనే బెల్లంకొండకి లాంగ్ టైమ్ తర్వాత హిట్ వచ్చింది.
అక్టోబర్ 17 నుండి ZEE5లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఒరిజినల్తో పాటు ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మొదటి హాఫ్ ఎంగేజింగ్, సెకండ్ హాఫ్లో ట్విస్ట్స్ బాగున్నాయి. హర్రర్ అట్మాస్ఫియర్ సూపర్. కొంచెం ప్రిడిక్టబుల్ అయినా, హారర్ ఫ్యాన్స్కి నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఓ లుక్కేసి థ్రిల్ ఫీల్ అవ్వండి.
Read Also : మనుషుల్ని చంపి మాస్క్ పెట్టే సైకో… హింట్ వదులుతూ హత్యలు… ఇంత బ్రూటల్ గా ఉన్నాడేంటి బ్రో
రాఘవ్ (బెల్లంకొండ), మైథిలి (అనుపమ) ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. వాళ్లు ఒక ఘోస్ట్ వాకింగ్ టూర్ కంపెనీ నడుపుతారు. టూరిస్టులను హాంటెడ్ ప్లేస్లకు తీసుకెళ్లి, ఫేక్ ఘోస్ట్ స్టోరీస్ చెప్పి భయపెట్టడం వాళ్ల బిజినెస్. కానీ ఒకసారి నిజమైన హాంటెడ్ ప్లేస్ కి వెళ్లాల్సి వస్తుంది. సువర్ణమాయ అనే పాడుబడిన రేడియో స్టేషన్ కి వెళ్తారు. అక్కడ గతంలో జరిగిన హత్యలు, రహస్యాలు బయట పడతాయి. స్టేషన్ సీల్ చేసి ఉన్నా, వాళ్లు లోపలికి వెళ్లి ఒక దెయ్యాన్ని మేలుకొల్పుతారు. అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడానికి, బతికి బయట పడడానికి చావుదాకా వెళతారు. ఇదే మెయిన్ ట్విస్ట్. రేడియో స్టేషన్ చుట్టూ తిరిగే కథలో ట్విస్ట్స్, హర్రర్ సీన్స్ బాగున్నాయి. నటీనటుల పెర్ఫార్మెన్సెస్బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాఘవ్ రోల్లో కూల్గా, ఇంటెన్స్గా కనిపించాడు. అనుపమ పరమేశ్వరన్ మైథిలిగా సూపర్, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆమె పెర్ఫార్మెన్స్ హైలైట్. శాండీ విలన్ రోల్లో భయపెట్టాడు. మిగతా క్యాస్ట్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. మరి అక్కడి నుంచి హీరో అండ్ టీం ఎలా బయట పడ్డారు ? అక్కడున్న దెయ్యాల కథ ఏంటి ? అన్నది స్టోరీ.